'మత విద్వేషాన్ని' ప్రోత్సహించినందుకు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు..

By SumaBala BukkaFirst Published Jan 11, 2024, 9:05 AM IST
Highlights

రెండు వర్గాల మధ్య 'మత విద్వేషాన్ని' ప్రోత్సహించారనే ఆరోపణలపై తమిళనాడు బిజెపి చీఫ్ కె అన్నామలైపై కేసు నమోదైంది.
 

తమిళనాడు : రెండు వర్గాల మధ్య మత విద్వేషాలను పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలైపై ధర్మపురి పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

జనవరి 8న పప్పిరెడ్డిపట్టి సమీపంలోని బొమ్మిడిలోని సెయింట్ లూర్డ్ చర్చి వెలుపల ఎన్ మన్ ఎన్ మక్కల్ ర్యాలీ సందర్భంగా చర్చిలోకి ప్రవేశించడాన్ని వ్యతిరేకించిన క్రైస్తవ యువకుల బృందంతో అతను వాగ్వాదానికి పాల్పడినందుకు అతనిపై కేసులు నమోదయ్యాయి.

Latest Videos

click me!