తమిళనాడు: బాణాసంచా వ్యాన్‌లో పేలుడు, ఇద్దరి మృతి

Siva Kodati |  
Published : Sep 30, 2019, 10:57 AM IST
తమిళనాడు: బాణాసంచా వ్యాన్‌లో పేలుడు, ఇద్దరి మృతి

సారాంశం

తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లాలో బాణాసంచాతో వెళుతున్న వ్యాన్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి

తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లాలో బాణాసంచాతో వెళుతున్న వ్యాన్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పెద్ద ఎత్తున శబ్ధాలు వినిపించడంతో జనం భయాందోళనలకు గురయ్యారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇదేరకమైన ప్రమాదం చోటు చేసుకుంది. సామర్లకోట మండలం మేడపాడులో ఓ బాణాసంచా కార్మాగారంలో భారీ పేలుడు చోటుచేసుకుంది.

ఈ ఘటనలో 12 మందికి తీవ్రగాయాలవ్వగా.. వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి.. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

PREV
click me!

Recommended Stories

#AccessCareerCounselors #careerguidance నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కి ఇచ్చే బెస్ట్ అడ్వైజ్
5ఏళ్లు కష్టపడితే లైఫ్ అంతా అద్భుతమే! #AccessCareerCounselors #careerguidance