Bihar MLC Election Results 2022: బీహార్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఏన్డీయే దూకుడు.. ఆర్జేడీకి ఎదురుదెబ్బ‌ !

Published : Apr 07, 2022, 05:23 PM IST
Bihar MLC Election Results 2022: బీహార్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఏన్డీయే దూకుడు..  ఆర్జేడీకి ఎదురుదెబ్బ‌ !

సారాంశం

Bihar MLC Election Results: బీహార్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈసారి 24 స్థానాలకు గానూ 187 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఏప్రిల్ 4న 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఎన్డీయే నుంచి జేడీయూ 11, బీజేపీ 12 స్థానాల్లో బ‌రిలోకి దిగాయి.   

Bihar MLC Election Results 2022: బీహార్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే దూకుడు కోన‌సాగుతోంది. ఇప్ప‌టివర‌కు వెలువ‌డిన 16 స్థానాల ఫ‌లితాల్లో ఎన్డీయే కూట‌మి 10 స్థానాల‌ను కైవ‌సం చేసేకుంది. ఇక ఆర్జేడీ నాలుగు స్థానాల‌తో స‌రిపెట్టుకోగా, మ‌రో రెండు స్థానాల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. వివ‌రాల్లోకెళ్తే.. బీహార్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈసారి 24 స్థానాలకు గానూ 187 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఏప్రిల్ 4న 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఎన్డీయే నుంచి జేడీయూ 11, బీజేపీ 12 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (బీహార్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు) 24 స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 24 శాసన మండలి స్థానాలకు ఏప్రిల్ 4న (సోమవారం) ఓటింగ్ జరిగింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. ఇది మొదటి శాసన మండలి ఎన్నికలు.. వీటిపై రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీల‌న్ని గెలుపు ధీమాను వ్య‌క్తం చేశాయి. లెక్కింపు తొలి ట్రెండ్స్‌లో ఎన్డీఏకు ఎడ్జ్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు 16 స్థానాల ఫలితాలు వెలువడగా, అందులో 10 సీట్లు ఎన్డీయే ఖాతాలోకి వెళ్లాయి. నాలుగు సీట్లు ఆర్జేడీ ఖాతాలోకి రాగా, రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. దీంతో పాటు మ‌రో ఎనిమిది స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ఓట్ల లెక్కింపు తాజా స‌మాచారం ప్ర‌కారం.. NDA కూట‌మి 13 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. ప్ర‌తిప‌క్ష RJD ఆరు స్థానాల్లో చాలా వెనుకబడి ఉంది. కాంగ్రెస్‌కు రెండు సీట్లు మరియు స్వతంత్రులు మూడు స్థానాల్లో ముందంజ‌లో ఉన్నారు. Bihar MLC Election లో లాలూ ప్ర‌సాద్  యాదవ్ నేతృత్వంలోని RJDకి ఎదురుదెబ్బ తగిలింద‌ని చెప్పాలి. ఆ పార్టీ కంచుకోట‌గా భావించే గోపాల్‌గంజ్‌లో MLC స్థానాన్ని కోల్పోయింది. అలాగే, పూర్నియా-అరారియా-కిషన్‌గంజ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి దిలీప్ జైస్వాల్ 6,943 ఓట్లు సాధించారు. 1,601 ఓట్లతో ఆర్జేడీ అభ్యర్థిని ఓడించారు. ముజఫర్‌పూర్‌ నుంచి జేడీ(యూ) అభ్యర్థి దినేష్‌ సింగ్‌ 4,400 ఓట్ల తేడాతో ఆర్‌జేడీ అభ్యర్థి శంభు సింగ్‌పై గెలుపొందారు. పాట్నా-గయాలో ఆర్జేడీ అభ్యర్థులు విజయం సాధించారు. 

ఆరా-భోజ్‌పూర్-బక్సర్ నుంచి ఎన్డీయే అభ్యర్థి రాధా చరణ్ సాహ్ విజయం సాధించారు. ఆయ‌న మ‌హాఘట్‌బంధన్‌కు చెందిన అనిల్ శ్రమత్‌ను ఓడించాడు. పాట్నా నుంచి ఆర్జేడీ అభ్యర్థి కార్తీక్ కుమార్ ఆర్జేడీ అభ్యర్థి కుమార్ నాగేంద్ర గయా-జెహనాబాద్-అర్వాల్ నుంచి గెలుపొందారు. కుమార్ నాగేంద్రకు 3795 ఓట్లు రాగా, జేడీయూకి చెందిన మనోరమాదేవికి 3267 ఓట్లు వచ్చాయి. సీతామర్హి నుంచి జేడీయూ అభ్యర్థి రేఖా కుమారి విజయం సాధించారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆమె విజయంతో జేడీయూ శిబిరంలో సంబరాల వాతావరణం నెలకొంది. భాగల్‌పూర్ నుంచి జేడీయూ అభ్యర్థి విజయం సాధించారు. అతను మహాఘటబంధన్‌కు చెందిన సంజయ్ యాదవ్‌ను ఓడించాడు. పాట్నా స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి కార్తీక్ కుమార్ తన సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి కర్మవీర్ యాదవ్‌పై విజయం సాధించారు. చాప్రా నుంచి బీజేపీ తిరుగుబాటు స్వతంత్ర అభ్యర్థి సచ్చిదానంద రాయ్ విజయం సాధించారు.
 

PREV
click me!

Recommended Stories

Nepal Flash Floods: నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన వందలాది మృ*తదేహాలు | Asianet News Telugu
భారీ వరదల తర్వాత నేపాల్ లో ప్రస్తుత పరిస్థితి | Drone Visuals | Nepal Flash Floods | From Devi Ghat