అంబులెన్స్‌లో డీజిల్ అయిపోయింది.. పేషెంట్ మరణించాడు

Published : Nov 26, 2022, 08:15 PM IST
అంబులెన్స్‌లో డీజిల్ అయిపోయింది.. పేషెంట్ మరణించాడు

సారాంశం

రాజస్తాన్‌లో పేషెంట్‌ను తీసుకెళ్లుతున్న ఓ అంబులెన్స్‌లో ఇంధనం అయిపోయింది. దీంతో అంబులెన్స్ దారి మధ్యలోనే ఆగిపోయింది. అందులోని పేషెంట్ మరణించారు. ఈ ఘటనను ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించారు.  

న్యూఢిల్లీ: ఓ పేషెంట్‌ను హాస్పిటల్ తీసుకెళ్లుతుండగా అంబులెన్స్‌లో ఇంధనం అయిపోయింది. దీంతో దారి మధ్యలోనే అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో పేషెంట్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లడం ఆలస్యమైంది. పేషెంట్ మరణించారు. ఈ ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది.

ఈ ఘటనను బన్స్వారా చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ ధ్రువీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని డాక్టర్ బీపీ వర్మ వివరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఫుడ్, సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫెర్స్ మంత్రి ప్రతాప్ కచరియవాస్ వివరించారు.

అంబులెన్స్ వాహనం ఇంధనం లేక ఆగిపోవడంతో ఆ పేషెంట్ బంధువులు వెహికిల్‌ను వెనక నుంచి నెడుతూ కనిపించారు. ఇందుకు సంబంధఇంచిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.

Also Read: అంబులెన్స్ లో రూ.25 కోట్లకు పైగా దొంగనోట్లు.. అనుమానం రాకుండా తరలిస్తూ, పట్టుబడి...

ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని సీఎంహెచ్‌వో వివరించారు. ఘటనపై దర్యాప్తు మొదలు పెట్టామని తెలిపారు. బాధితుల బంధువులను కలుస్తామని, ఘటనలో ఏదైనా నిర్లక్ష్యం ఉన్నదేమో అని తెలుసుకుంటామని వివరించారు. అయితే, ఆ అంబులెన్స్ ప్రైవేట్ యాజమాన్యానికి చెందినదని తెలిపారు. ఒక వేళ అంబులెన్స్ ప్రైవేట్ ఓనర్లది అయితే.. అందులో ఇంధనం అయిపోవడమనే సమస్య వారికి మాత్రమే చెందుతుందని, అందుకు ప్రభుత్వం బాధ్యత వహించదని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Social Media Ban : పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్... ఎలా అమలుచేస్తారో తెలుసా..?
Jobs : రంగాల వారీగా టార్గెట్స్ ఫిక్స్... ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు