పార్కింగ్ ప్లేస్‌లో అగ్నిప్రమాదం... 200 కార్లు దగ్ధం

Siva Kodati |  
Published : Feb 24, 2019, 03:35 PM IST
పార్కింగ్ ప్లేస్‌లో అగ్నిప్రమాదం... 200 కార్లు దగ్ధం

సారాంశం

బెంగళూరు ఏరో ఇండియా షోలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 300 కార్లు కాలి బూడిదైపోయిన ఘటనను మరచిపోకముందే చెన్నైలో అదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది.

బెంగళూరు ఏరో ఇండియా షోలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 300 కార్లు కాలి బూడిదైపోయిన ఘటనను మరచిపోకముందే చెన్నైలో అదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది. పోరూర్‌లోని ఓ పార్కింగ్ ప్రదేశంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 200 కార్లు కాలి బూడిదయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 5 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, అగ్నికీలల్లో కొంతమంది వ్యక్తులు చిక్కుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

Army: భారత అమ్ములపొదిలో మరో అద్భుతం.. రంగంలోకి డ్రోన్ క్యాచర్ సిస్టమ్. ఎలా పనిచేస్తుందంటే.?
Richest cities: దేశంలో టాప్ 10 ధ‌నిక‌ న‌గ‌రాలు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు సిటీలు