పార్కింగ్ ప్లేస్‌లో అగ్నిప్రమాదం... 200 కార్లు దగ్ధం

Siva Kodati |  
Published : Feb 24, 2019, 03:35 PM IST
పార్కింగ్ ప్లేస్‌లో అగ్నిప్రమాదం... 200 కార్లు దగ్ధం

సారాంశం

బెంగళూరు ఏరో ఇండియా షోలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 300 కార్లు కాలి బూడిదైపోయిన ఘటనను మరచిపోకముందే చెన్నైలో అదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది.

బెంగళూరు ఏరో ఇండియా షోలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 300 కార్లు కాలి బూడిదైపోయిన ఘటనను మరచిపోకముందే చెన్నైలో అదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది. పోరూర్‌లోని ఓ పార్కింగ్ ప్రదేశంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 200 కార్లు కాలి బూడిదయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 5 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, అగ్నికీలల్లో కొంతమంది వ్యక్తులు చిక్కుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

Tamil Nadu CM Vijay: సామాన్యుడిలా బస్సులో ప్రయాణిస్తూ వీడియో తీసుకున్న సీఎం విజయ్| Asianet Telugu
Arunachal Pradesh Flood: అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వరదలు కొట్టుకుపోయిన ఇళ్లు, వాహనాలు| Asianet Telugu