ఘోర రోడ్డు ప్రమాదం.. లోతైన లోయలో పడ్డ అంబులెన్స్ .. ఇద్దరు ఆర్మీ జవాన్ల మృతి  

Published : Apr 29, 2023, 04:47 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. లోతైన లోయలో పడ్డ అంబులెన్స్ .. ఇద్దరు ఆర్మీ జవాన్ల మృతి   

సారాంశం

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించారు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఓసి) సమీపంలోని కేరీ సెక్టార్ వద్ద ప్రమాదం జరిగింది.

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సైనికులు మరణించారు. అదే సమయంలో ఈ ప్రమాదంలో మరో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఓసీ) సమీపంలోని కెర్రీ సెక్టార్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీ సిబ్బంది ప్రయాణిస్తున్న అంబులెన్స్ రోడ్డుపై నుంచి  లోతైన లోయలో పడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఆర్మీ, పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న ఆర్మీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నియంత్రణ రేఖ సమీపంలోని దుంగి గాలా సమీపంలో అంబులెన్స్ మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌ డ్రైవర్‌, ఓ జవాన్‌ మృతి చెందినట్లు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది వారి మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీశారు. వీరమరణం పొందిన జవాన్లలో ఒకరు బీహార్ వాసి కాగా, మరో జవాన్ స్థానికుడు. 

గతేడాది కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గత ఏడాది డిసెంబర్‌లో ఉత్తర సిక్కిం సమీపంలో ఏటవాలుగా ఉన్న వాలుపై నుంచి వాహనం దూసుకెళ్లడంతో 16 మంది సైనిక సిబ్బంది మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు.
 

PREV
click me!

Recommended Stories

Trisha Reaches Vijay Residence: విజయ్ ఇంటికి చేరుకున్న త్రిష ఫ్యాన్స్ రచ్చ చూసి షాక్| Asianet Telugu
Heavy Security at Vijay Residence: విజయ్ ఇంటిముందు భారీ బందోబస్తు| Asianet News Telugu