ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ..11మంది మృతి

Published : Nov 23, 2019, 08:57 AM IST
ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ..11మంది మృతి

సారాంశం

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

రాజస్థాన్ లో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగోర్ జిల్లాలోని కుచామన్ పట్టణ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వచ్చిన రెండు మినీ బస్సులు ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్లపై కేంద్రం సంచలనం.. 816 సీట్లు.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఎంపీ స్థానాలు ఇవే !
Modi Speech on Delimitation in Parliament డీ లిమిటేషన్ పైపార్లమెంటులో మోదీ స్పీచ్ | Asianet Telugu