ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై దేశంలోని రాజకీయ నేతలు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ తనదైన శైలిలో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై డీఎంకే ఎలాంటి బాధపడటంలేదన్నారు.
ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై దేశంలోని రాజకీయ నేతలు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ తనదైన శైలిలో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై డీఎంకే ఎలాంటి బాధపడటంలేదన్నారు.
మూడు రోజుల్లో ప్రజాతీర్పు తెలుస్తుంది... అందుకోసం మేం ఎదురుచూస్తున్నాం.. అది అనుకూలమైనా, వ్యతిరేకమైనా స్టాలిన్ పర్లేదన్నారు. ఏడు దశల పోలింగ్ ముగియగానే దాదాపు అన్ని సర్వే సంస్థలు తమిళనాడులో అత్యధిక స్థానాలు డీఎంకేకు దక్కుతాయని పేర్కొన్నాయి.
కాగా.. కేంద్రంలో అధికారం చేపట్టే ఏ కూటమిలోనైనా సరే డీఎంకే భాగస్వామిగా ఉంటుందా.. అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దానికి మే 23న ఓట్ల లెక్కింపు జరిగిన తరువాత వెల్లడిస్తామని స్టాలిన్ తెలిపారు.