యరకల యాదయ్య తెలుగు కవిత: చెప్తే వినడు

By telugu teamFirst Published Apr 5, 2020, 2:35 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరినస్తున్న నేపథ్యంలో భారతదేశంలో లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ లాక్ డౌన్ నియమాలను పాటించకపోవడంపై ఆగ్రహంతో యరకల యాదయ్య కవిత రాశారు.

చెప్తే వినడు వీడు చెప్తే వినడు
అన్ని నాకు తెల్సునంటడు

చెప్తే వినటాన్కి చిన్నోడు కాడు
చెప్పేదానికి పెద్దోడు కాడు
మీడియా అంతా కోడై కూసిన
లోకానికంత డప్ఫై చాటిన

చెప్తేవినడు వీడు చెప్తే వినడు
అన్ని నాకు తెల్సు నంటడు

గడపదాటి తిరుగొద్దంటే
ఊరంతా నాదే నంటడు
నెత్తినోరు బాదుకున్న
తిరిగేది ఆపనంటడు
బద్రంగుండని యెంత చెప్పిన
పిచ్చోలని ముద్ర వేస్తడు 

చెప్తే వినడు వీడు చెప్తే వినడు
అన్ని నాకు తెల్సు నంటడు

తియ్య తియ్యని మాటలతో
తియ్యగ గొంతు కొస్తదన్న 
సన్నిహితుడు హితుడైన
సావసం ముచ్చటే వద్దన్న

చెప్తే వినడు వీడు చెప్తే వినడు
అన్ని నాకు తెల్సునంటడు

మాయదారి కరోన రోగం
గొలుసులల్లుతున్నదంటే 
సంచరించే దారిలో సప్పున
కాటేస్తదన్న
నాల్గుదినాలోపికపట్టి
ఇంటి పట్టున ఉండమ్మన్న

చెప్తే వినడు వీడు చెప్తే వినడు
అన్ని నాకు తెల్సునంటడు

మంచి మాటలు యెంత చెప్పిన
చెవిన పెట్టనోడు
విశ్వానంత చుట్టివేసిన ఇకనైన
తెలుసుకోనోడు
అంత అయ్యి పోయినంక 
తెల్సుకొంటే ఏముంటది.
కొంతనైన జాగ్రత పడితే
విశ్వమంత నీదే ఔతది.

చెప్తే వినడు వీడు చెప్తే వినడు
అన్ని నాకు తెల్సునంటడు .

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/topic/literature

click me!