రేపు కరీంనగర్ లో 'జల్లెడ' పుస్తకావిస్కరణ-అంకితోత్సవం

Published : Mar 10, 2023, 12:14 PM IST
రేపు కరీంనగర్ లో 'జల్లెడ' పుస్తకావిస్కరణ-అంకితోత్సవం

సారాంశం

కరీంనగర్ :రచయిత కూకట్ల తిరుపతి రాసిన ' జల్లెడ ' ఎన్నీల ముచ్చట్లు సమీక్షా వ్యాసాల పుస్తకావిష్కరణ - అంకితోత్సవం కరీంనగర్ లో జరగనుంది. మార్చి 11న అంటూ రేపు శనివారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ ఫిలింభవన్ లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఈ   కార్యక్రమం జరగనుంది.    

'జల్లెడ' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కందుకూరి అంజయ్య అధ్యక్షులుగా, ప్రముఖ తమిళ కవి జననేసన్ రాజగోపాల్ వీరరాఘవన్ ముఖ్య అతిథిగా, పుస్తక స్వీకర్తగా డా. నలిమెల భాస్కర్, అతిథులుగా గాజోజు నాగభూషణం, నగునూరి శేఖర్, అన్నవరం దేవేందర్ పాల్గొననున్నారని నిర్వహకులు తెలిపారు. బూర్ల వెంకటేశ్వర్లు పుస్తక పరిచయం చేస్తారు. సి.వి.కుమార్, తోట నిర్మలారాణి, పెనుగొండ సరసిజ, రామానుజం సుజాత సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.
 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం