అత్యాధునిక తెలుగు సాహిత్యంపై సదస్సు

Published : Dec 09, 2020, 02:57 PM ISTUpdated : Dec 10, 2020, 04:49 PM IST
అత్యాధునిక తెలుగు సాహిత్యంపై సదస్సు

సారాంశం

అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు,రూప పరిణామం (2000-202) అనే అంశంపై ఆ సెమినార్ 2021 జనవరి 19, 20, 21 తేదీలలో  జరుగుతుంది. 

తెలుగు అధ్యయన శాఖ బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు మరియు నెచ్చెలి అంతర్జాల వనితా మాస  పత్రిక,కాలిఫోర్నియా, యూ.ఎస్.ఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాల అంతర్జాతీయ వెబినార్
అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు,రూప పరిణామం (2000-2020)
2021 జనవరి 19, 20 & 21 తేదీలలో  జరుగును.
ఈ సదస్సులో పాల్గొనేవారు 
మీ పరిశోధన పత్రాలను teluguweb2021@gmail.com అనే మెయిల్ ఐడికి 25/12/2020 లోపు పంపగలరు. ఆ తర్వాత పంపే   పరిశోధన పత్రాలు ముద్రణకు తీసుకోబడవని గ్రహించగలరు.  పరిశోధన పత్రాలను అను-7,  ప్రియాంక  ఫాంట్ 18, లైన్ స్పేస్ 21 తో  లైన్
స్పేస్ పేజీమేకర్ ఫైల్ తో పాటు, తప్పనిసరిగా యూనికోడ్ ఫాంట్ తో వర్డ్ ఫైల్ లో కూడా
పంపాలి. పరిశోధనా పత్రం 5 పేజీలు మించకుండా ఉండాలి. పిడియఫ్ లు పరిగణనలోకి తీసుకోబడవు.  వివరాలకు: ఆచార్య కె. ఆశాజ్యోతి
తెలుగు అధ్యయన శాఖాధ్యక్షులు, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు
ఫోన్: 9449672394; మెయిల్ ఐడి: teluguweb2021@gmail.com
లేక
డా. కె. గీత
కంప్యూటేషనల్ లింగ్విస్ట్, ఆపిల్, కాలిఫోర్నియా, యు.ఎస్.ఏ.కవయిత్రి & సంస్థాపక సంపాదకులు, నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం