మార్చి 17న 'వర్తన' రెండవ సమావేశం

Published : Mar 15, 2024, 11:47 AM IST
మార్చి 17న 'వర్తన' రెండవ సమావేశం

సారాంశం

మార్చి 17న 'వర్తన' రెండవ సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో ' కవిత్వ వాస్తవికత ' అనే అంశంపై కవి సిద్ధార్థ  ప్రసంగిస్తారు.  

సాహిత్యరంగంలో నవీన ధోరణులు పాదు కొల్పాలన్న లక్ష్యంతో ఏర్పాటయిన వర్తన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో రెండవ సమావేశం 17 మార్చి  2024 ఆదివారం ఉదయం 10.30 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుది.  ఈ సమావేశంలో ' కవిత్వ వాస్తవికత ' అనే అంశంపై కవి సిద్ధార్థ  ప్రసంగిస్తారు.  కవి సిద్ధార్థ కలం నుంచి దీపశీల, బొమ్మలుబాయి, JASMINE WATER'S (English)  కవితా సంకలనాలు వెలువడ్డాయి.

కవి సిద్దార్థ గతంలో ఆంధ్రప్రభ  ' సాహితీ గవాక్షం' లో ప్రజంటెన్స్ - పాఠకుని వాచకం శీర్షికన సంవత్సరంన్నరపాటు రాసిన ‌సాహిత్య విమర్శనా వ్యాసాలు తెలుగు సాహిత్యంలో ఆరోగ్యకరమైన చర్చకు దారితీసి తెలుగు సాహిత్య పరిపుష్టకి దోహదపడ్డాయి.

ఈ  సమావేశానికి డా. రూప్ కుమార్ డబ్బీకార్ అధ్యక్షత వహిస్తారు. ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ సమన్వయకర్త గా వ్యవహరిస్తారు. కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు అందరూ ఆహ్వానితులేన‌ని వ‌ర్త‌న కార్య‌ద‌ర్శి  ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం