సినారె కవితా పురస్కారానికి కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి "తొణకని వాక్యం" ఎంపిక

Published : Nov 25, 2020, 04:50 PM ISTUpdated : Nov 25, 2020, 04:51 PM IST
సినారె కవితా పురస్కారానికి కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి "తొణకని వాక్యం" ఎంపిక

సారాంశం

యేటా సీనియర్ కవులకు ఇచ్చే సినారె కవితా పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవితా సంపుటి తొణకని వాక్యం దక్కించుకుంది. ఈ విషయాన్ని పురస్కార నిర్ణతలు ప్రకటించారు. 

సాహితీ గౌతమి- కరీంనగర్ ప్రతియేట ఇరు రాష్ట్రాలలో లబ్దప్రతిష్టులైన కవులకు ఇచ్చే సినారె పురస్కారం ఈ సంవత్సరం అనగా 2020కి గాను పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి తొణకని వాక్యం కవితా సంపుటి ఎంపికైంది. ఈ విషయాన్ని పురస్కార కమిటీ కన్వీనర్ డాక్టర్ యెడవల్లి విజయేంద్ర రెడ్డి, సాహితీ గౌతమి అధ్యక్షకార్యదర్శులు డా"గండ్ర లక్ష్మణరావు,గాజుల రవీందర్ తెలియజేశారు.
      
ప్రతియేట ఇరురాష్ట్రాల స్థాయిలో ప్రతిష్టాత్మకంగా అందించే సాహితీగౌతమి సినారె పురస్కారం కోసం ఇరురాష్ట్రాల నుండి దాదాపుగా 250కవితాసంకలనాలు వచ్చాయని వాటిని ఈ సంవత్సరానికిగాను న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ప్రముఖకవులు కందుకూరి శ్రీరాములు, మందరపు హైమవతి, వెల్దండ నిత్యానందరావులకు పంపించామని,ఈ ముగ్గురి న్యాయనిర్ణేతలనుండి వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ సంవత్సరం తొణకనివాక్యం ఎంపికైందని వారు చెప్పారు.
       
 త్వరలోనే ఈ పురస్కార ప్రదానోత్సవం ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.ఈ ఫలితాల ప్రకటనలో పురస్కార కమిటీ సభ్యులు దాస్యం సేనాధిపతి, డా.బి.వి.ఎన్.స్వామి పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం