స్వీట్లను తినని వారు అస్సలు ఉండరేమో.. ఇక దీపావళీ స్పెషల్ స్వీట్లు మనల్ని ఎలా టెంప్ట్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఇవెంత రా.. రామ్మని పిలిచినా.. షుగర్ పేషెంట్లు మాత్రం అస్సలు తినకూడదు.. లేదంటే రక్తంలో షుగర్ లెవెల్స్ దారుణంగా పెరిగే అవకాశం ఉంది.
పండుగ ఏదైనా సరే.. స్వీట్లు మాత్రం పక్కాగా ఉండాల్సిందే.. అసలు స్వీట్లు లేకుండే పండుగ పూర్తి కాదేమో.. అందులో దీపావళికి అయితే రకరకాల స్వీట్లు నోరూరిస్తాయి. వాటిని చూస్తే తినకుండా ఉండటం చాలా కష్టమబ్బా.. కానీ స్వీట్లను ఎక్కువ తినడం మరీ అంత మంచిది కాదు.. ముఖ్యంగా స్వీట్లు మధుమేహులకు అస్సలు మంచివి కావు. ఏదైతే అది ఐతదని స్వీట్లను తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. మరి మధుమేహులు స్వీట్లను చూసినప్పుడు వాళ్లను వారు కంట్రోల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పదండి..
బీటో అధ్యయనం ప్రకారం.. పండుగల సమయాల్లోనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ముఖ్యంగా దీపావళీ సమయంలో. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 250 మి.గ్రా / డిఎల్ స్థాయిలు ఉన్న వ్యక్తుల్లో దీపావళి సమయంలో ఇది దాదాపు 15 శాతం పెరుగుతుందట. ఇక 300 మి.గ్రా/డిఎల్ కంటే ఎక్కువ ఉన్నవారిలో ఏకంగా 18 శాతం షుగర్ లెవెల్స్ పెరిగాయట. ఇది దీపావళి తర్వాత కొన్ని రోజుల వరకు కూడా అలాగే ఉంటుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ పండుగ సీజన్ లో మధుమేహాన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం పదండి.