UPSC 2020 లో 23వ ర్యాంకు సాధించిన ముస్లిం మహిళ..!

By telugu news teamFirst Published Nov 1, 2021, 4:24 PM IST
Highlights

తాను చిన్నతనంలో వార్తాపత్రికలు ఎక్కువగా చదివేదానిని ఆమె చెప్పారు. వాటి ద్వారా ప్రజలకు ఏది కావాలన్నా..  కలెక్టర్ దగ్గరకే వెళ్తారనే విషయం అర్థం అయ్యింది. అందుకే.. తనకు కూడా కలెక్టర్ కావాలనే నిర్ణయం అప్పుడే తీసుకుంది. చివరకు అనుకున్నది సాధించింది. 

ముస్లిం కుటుంబాలలో మహిళలు ఉన్నత చదువులు చదవడానికి పెద్దలు అంగీకరించరనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది.  అయితే.. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఓ మహిళ.. ఆ కట్టుబాట్లను చెరిపేసి.. యూపీఎస్సీలో 23వ ర్యాంకు సాధించింది.  ఆమె సదాఫ్ చౌదరి. అమ్రోహాలోని జోయా పట్టణానికి చెందిన సదాఫ్  చౌదరి.. తాను ఈ ఘనత సాధించడానికి పడిన కష్టాన్ని స్వయంగా వివరించారు.

తాను వచ్చిన నేపథ్యంలో.. ముస్లిం అమ్మాయిలు పెద్దగా చదువుకోలేదని ఆమె చెప్పడం గమనార్హం. అయితే.. వాటికి భిన్నంగా.. సదాఫ్ ఘనత సాధించారు. తనలాంటి ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచినందుకు ఆనందంగా ఉందని ఆమె చెప్పడం గమనార్హం.

తనను ఇంట్లో పెళ్లి చేసుకోమని.. భర్తను జాగ్రత్తగా చూసుకుంటే  చాలు అని చెబుతూ ఉండేవారని.. ఉద్యోగం లాంటివి ఏమీ వద్దు అని అంటూ ఉండేవారని ఆమె చెప్పారు. అయితే.. అవన్నీ కాకుండా.. తాను ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఉందని.. దాని కోసమే.. తన లాంటివారికి ఒక రోల్ మోడల్ కావాలని నిర్ణయం తీసుకున్నానని.. అందు కోసం తాను ఎంతోకష్టపడ్డానని చెప్పింది.

సదాఫ్ తన విజయ క్రెడిట్‌ని తన తండ్రి మహ్మద్ ఇస్రార్‌కు, తల్లి షాబాజ్ బానోకు ఇచ్చారు. ఇలా ఎందుకు చేస్తున్నావు.. అని ఏ రోజు వాళ్లు తనను ఎదురు ప్రశ్నించలేదని ఆమె చెప్పడం గమనార్హం. సోదరి సైమా కూడా తనకు ఎంతోగానో సహకరించిందట. తన విజయంలో స్నేహితుల పాత్ర కూడా ఎక్కువగా ఉందని ఆమె చెబుతోంది.

సదాఫ్ ఇంట్లోనే ఉంటూ UPSC పరీక్షకు సిద్ధమయ్యారు. రెండేళ్లు కష్టపడ్డారట. సదాఫ్ చదువుతున్న సమయంలో ఎవరితోనూ అంతగా ఇంటరాక్షన్ ఉండేది కాదని చెప్పింది. పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్నప్పుడు. చదువుకోవడానికి వనరులు లేని చోట పెద్దగా మార్గదర్శకత్వం ఉండదు. మీరు వైఫల్యాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. నేను నా భావోద్వేగాలను నిర్వహించవలసి వచ్చింది. అతని మొదటి ప్రిలిమ్స్ బయటకు రానప్పుడు. అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తన జర్నీ చాలా సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. ఈ ప్రయాణం తన వ్యక్తిత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో చాలా నేర్పింది. మిమ్మల్ని మీరు ఎలా నిర్వహించుకోవాలి.

తాను చిన్నతనంలో వార్తాపత్రికలు ఎక్కువగా చదివేదానిని ఆమె చెప్పారు. వాటి ద్వారా ప్రజలకు ఏది కావాలన్నా..  కలెక్టర్ దగ్గరకే వెళ్తారనే విషయం అర్థం అయ్యింది. అందుకే.. తనకు కూడా కలెక్టర్ కావాలనే నిర్ణయం అప్పుడే తీసుకుంది. చివరకు అనుకున్నది సాధించింది. 

సదాఫ్ చౌదరి ఇంటర్వ్యూకి ముందు చాలా నమ్మకంగా ఉందట. ఇంటర్వ్యూకు ముందు మాక్ ఇంటర్వ్యూ ఇచ్చిందట. ఇందులో మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. మరోవైపు, COVID-19 మహమ్మారి కారణంగా ఇంటర్వ్యూ కొంతకాలం వాయిదా పడింది. ఈ కారణంగా, అతను ప్రిపరేషన్ కోసం చాలా సమయం దొరికింది. దానిని సద్వినియోగం చేసుకుంది. సదాఫ్ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయినందున. ఇంటర్వ్యూ బోర్డును ఎదుర్కొనే భయం లేదు అని చెప్పింది. ఆమె ఇంటర్వ్యూ దాదాపు 35 నిమిషాలపాటు సాగిందట.

click me!