సౌదీ ఎయిర్ పోర్ట్ పై తిరుగుబాటు దారుల దాడి.. మంటల్లో విమానం...

Published : Feb 11, 2021, 04:43 PM IST
సౌదీ ఎయిర్ పోర్ట్ పై తిరుగుబాటు దారుల దాడి.. మంటల్లో విమానం...

సారాంశం

యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని అభా విమానాశ్రయం లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎయిర్ పోర్ట్ లో ఆగి ఉన్న ఓ పౌర విమానంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. 

యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని అభా విమానాశ్రయం లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎయిర్ పోర్ట్ లో ఆగి ఉన్న ఓ పౌర విమానంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. 

ఈ మంటల దాటికి విమానం స్వల్పంగా దెబ్బతిన్నది. అయితే ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో విమానాశ్రయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పటికే హౌతీ తిరుగుబాటుదారులు అభా విమానాశ్రయం మీద పలుమార్లు డ్రోన్లు, క్షిపణులతో దాడికి పాల్పడ్డారు.

ఈ దాడుల్లో చాలామంది గాయపడ్డారు కూడా. కానీ, తొలిసారి తిరుగుబాటుదారుల దాడి వల్ల ఓ విమానంలో మంటలు అంటుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సౌదీ మీడియా సమాచారం ప్రకారం మంటలు చెలరేగిన విమానం ఎయిర్ బస్ ఏ320గా తెలిసింది. 

ఈ ఘటనలో విమానాల ట్రాకింగ్ కు అంతరాయం కలగడం వల్ల విమాన సర్వీసుల రాకపోకలు ఆలస్యం అవుతున్నట్లు అధికారులు తెలిపారు. 2017 నవంబర్ లో కూడా ఇలాగే హౌతీ తిరుగుబాటు దారులు రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?