
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir Putin ) ఉక్రెయిన్లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించారు. పుతిన్ గంట సేపు టెలివిజన్ ద్వారా ప్రసంగించి ఈ వివరాలు వెల్లడించారు. దీని కంటే ముందు ఉక్రెయిన్ వేర్పాటువాద నాయకులతో అధికారికంగా స్నేహం, సహాయ ఒప్పందాలపై సంతకం చేసినట్లు వార్తా సంస్థ AFP నివేదించింది. దొనేత్సక్ పీపుల్స్ రిపబ్లిక్, లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ స్వాతంత్రం, సార్వభౌమాధికారాన్ని వెంటనే గుర్తించడానికి కాలం చెల్లిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను ’’ అని పుతిన్ చెప్పారు.
ఈ ప్రకటన వెలువడిన తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జాతీయ భద్రతా మండలిని సమావేశపరిచారు. తాను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో సమావేశమయ్యానని, దేశ భద్రతపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో మాట్లాడతానని ట్వీట్లో తెలిపారు. ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా రక్షణ మండలి సమావేశానికి పిలుపునిచ్చారు.
జర్మన్ ఛాన్సలర్ పుతిన్ నిర్ణయాన్ని ఖండించారు. పుతిన్ ఉక్రెయిన్ తిరుగుబాటుదారులను గుర్తించడం శాంతి ఒప్పందాలను ఏకపక్షంగా ఉల్లంఘించడమే అవుతుంది అని అన్నారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని అణగదొక్కే ఏకపక్ష చర్య ను UN హెచ్చరించింది. UN సెక్రటరీ జనరల్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఉక్రెయిన్ లో దిగజారుతున్న పరిస్థితి కారణంగా న్యూయార్క్లోని ప్రధాన కార్యాలయానికి తిరిగి వస్తారని ఆయన ప్రతినిధి చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ నుంచి రష్యాలోని రోస్టోవ్ ప్రాంతంలోకి ప్రవేశించిన ఐదుగురు అనుమానిత విధ్వంసకారులను చంపినట్లు రష్యన్ మిలిటరీ తెలిపింది వారి వద్ద ఉన్న రెండు సాయుధ వాహనాలను కూడా ధ్వంసం చేసి ఉక్రేనియన్ సైనికుడిని అదుపులోకి తీసుకుంది. ఉక్రేనియన్ బోర్డర్ గార్డ్ ప్రతినిధి ఆండ్రీ డెమ్చెంకో ఈ ప్రకటనను తప్పుడు సమాచారం అని కొట్టిపారేశారు. ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల మధ్య U.S. అడ్మినిస్ట్రేషన్ యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల చీఫ్కి ఒక లేఖను పంపింది.