తూర్పు కాంగోలోని బుకావులో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి...

By SumaBala BukkaFirst Published Dec 12, 2023, 8:31 AM IST
Highlights

తూర్పు కాంగోలోని బుకావులో రాత్రిపూట కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఇల్లు కూలిపోవడంతో కనీసం 14 మంది మరణించారు.

కాంగో : ఆఫ్రికా ఖండంలోనే రెండో అతి పెద్దవి దేశమైన కాంగోలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ, కుండపోత వర్షాల కారణంగా వరదలు.. కొండ చర్యలు విరిగి పడుతుండడంతో ఇల్లు కూలిపోయాయి. వీటి కింద పడి 14 మంది మృతి చెందారు. బాధితులందరూ ఇబాండాలోని బుకావు కమ్యూన్‌ నివాసులే, అక్కడ వర్షం కింద కూలిపోయిన తాత్కాలిక ఇళ్లలో చాలా మంది నివసిస్తున్నారు, కమ్యూన్ మేయర్ జీన్ బాలెక్ ముగాబో టెలిఫోన్ ద్వారా రాయిటర్స్‌తో చెప్పారు.

మరి కొంతమంది ఈ శిథిలాల కింద ఉన్నట్లుగా సమాచారం. పలువురు బాధితులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాంగో లోని బుకావు నగరంలో ఈ ఘటన వెలుగు చూసింది. కాంగోను ఈ వరుస విషాదాలు అతలాకుతలం చేస్తున్నాయి. 

చీమ్మ చీకట్లో శ్రీలంక.. ద్వీప దేశంలో నిలిచిపోయిన కరెంటు సరఫరా..

అంతకు ముందు సెప్టెంబర్ లో కూడా ఇలాంటి కుండపోత వర్షాల కారణంగానే… కొండ చర్యలు విరిగిపడి 17 మంది మృతి చెందారు. వాయువ్య కాంగోలోని మంగళ ప్రావిన్స్ లో. లిస్లే నగరంలోని కాంగో నది ఒడ్డున ఈ ప్రమాదం జరిగిందని పౌర సమాజ సంస్థ ఫోర్సెస్ వైఫ్ అధ్యక్షుడు మాథ్యూ మోల్  తెలిపారు. సెప్టెంబర్ కంటే ముందు మే నెలలో కూడా ఇలాంటి విపత్తే సంభవించింది. కాంగోలోని దక్షిణ కివు ప్రావిన్స్ లోని కలేహే ప్రాంతంలో వరదలు రావడంతో  కొండ చరియలు విరిగిపడి.. వేలాది ఇల్లు, ఆస్పత్రులు,  పాఠశాలలు నీటమునిగాయి. దీంతో ఆ సమయంలో వందలాది మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 170 మంది మరణించారు. 

డిసెంబరు 20న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగో రాజకీయ ప్రచారంలో ఉంది. ఇది ఆఫ్రికాలోని రెండవ అతిపెద్ద దేశం అంతటా బలహీనమైన మౌలిక సదుపాయాలను హైలైట్ చేసింది. ముఖ్యంగా బుకావు ఉన్న సౌత్ కివు వంటి వివాదాలతో దెబ్బతిన్న తూర్పు ప్రావిన్సులలో పేదరికం, పేలవమైన మౌలిక సదుపాయాలు ఇబాండాలో ఉన్న కమ్యూనిటీలను భారీ వర్షం వంటి తీవ్రమైన వాతావరణానికి మరింత హాని కలిగిస్తున్నాయి.

click me!