COP28 climate summit : 2028లో భారత్‌లో ‘‘COP33’’ సదస్సు.. ప్రధాని మోదీ కీలక ప్రతిపాదన

Siva Kodati |  
Published : Dec 01, 2023, 05:13 PM IST
COP28 climate summit : 2028లో భారత్‌లో ‘‘COP33’’ సదస్సు..  ప్రధాని మోదీ కీలక ప్రతిపాదన

సారాంశం

దుబాయ్‌లో జరిగిన COP28 వాతావరణ సదస్సులో ప్రసంగిస్తూ 2028లో భారతదేశంలో COP33 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనకు ఇంకా ఆమోదం లభించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

శుక్రవారం దుబాయ్‌లో జరిగిన COP28 వాతావరణ సదస్సులో ప్రసంగిస్తూ 2028లో భారతదేశంలో COP33 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. 'వాతావరణ మార్పు కోసం ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్‌కు భారతదేశం కట్టుబడి ఉంది. అందుకే ఈ దశ నుంచి 2028లో భారతదేశంలో COP33 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నాను, అని మోడీ పేర్కొన్నారు.

ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో వాతావరణ మార్పులపై సదస్సును నిర్వహిస్తున్నారు. నవంబర్ 30న సదస్సు ప్రారంభమవ్వగా.. డిసెంబర్ 12 వరకు చర్చ కొనసాగనుంది. దుబాయ్‌లో జరిగిన సదస్సు అధికారిక ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ప్రసంగించే అవకాశం లభించింది. ఈ వేదిక నుంచి వాతావరణ సంబంధిత అంశాలపై రానున్న రోజుల్లో చర్చ జరగనుంది.

 

 

కాగా.. భారత్ ఇటీవలే జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించింది. సదస్సుకు పలు దేశాధినేతలు హాజరుకావడం అభినందనీయమన్నారు. ఈ సదస్సు విజయవంతంగా నిర్వహించబడిన నేపథ్యంలో, ఈసారి వాతావరణ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వాలని భారతదేశం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనకు ఇంకా ఆమోదం లభించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇప్పటి వరకు గ్లోబల్ సౌత్ నుంచి ఈ ఒప్పందంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఐక్యరాజ్యసమితి వాతావరణ చర్చలు COP28 సానుకూల గమనికతో ప్రారంభమయ్యాయి. దాని నష్ట నిధి నిర్వహణపై దేశాలు ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయి. నిర్ణయం ప్రకటించిన వెంటనే.. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ 'X'లో పోస్ట్ చేసారు. 'UAEలో మొదటి రోజు COP28 సానుకూల సంకేతాలు ఊపందుకుంటున్నాయి. COP28 ప్రారంభ సెషన్‌లో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ నిర్వహణపై చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబడింది. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్‌ను ప్రారంభించాలనే నిర్ణయానికి భారతదేశం గట్టిగా మద్దతు ఇస్తుంది అన్నారు. 

 

 

వరదలు, కరువులు , వేడి గాలులు సహా విపత్తులను ఎదుర్కోవడానికి గ్లోబల్ సౌత్‌లో చాలా కాలంగా తగినంత నిధులు లేవు. గ్లోబల్ సౌత్ అనేది తరచుగా అభివృద్ధి చెందుతున్న, తక్కువ అభివృద్ధి చెందిన లేదా అభివృద్ధి చెందని దేశాలను సూచిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ కర్బన ఉద్గారాల ప్రభావం ఈ దేశాలపై అత్యధికంగా పడినందున, ఈ దేశాలకు సహాయం చేయడం సంపన్న దేశాల బాధ్యత అని కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు పేర్కొంటున్నాయి.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే