మైనర్ ను బలవంతంగా ముద్దాడి... ఊచలు లెక్కిస్తున్న ఎన్నారై

Published : Oct 21, 2020, 07:33 AM ISTUpdated : Oct 21, 2020, 07:49 AM IST
మైనర్ ను బలవంతంగా ముద్దాడి... ఊచలు లెక్కిస్తున్న ఎన్నారై

సారాంశం

సింగపూర్ లో మహిళల రక్షణ కోసం చట్టాలు ఎంత కఠినంగా వుంటాయో తెలియజేసే సంఘటన ఒకటి బయటపడింది. 

సింగపూర్: మన దేశంలో మహిళా రక్షణ కేవలం చట్టాలకే పరిమితమవుతోంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడటమే కాదు ఆ క్రమంలో హత్యలు చేసిన నిందితులు కూడా దర్జాగా బయట తిరుగుతున్న సంఘటనలు అనేకం. ఇదీ మన దేశంలో మహిళా రక్షణ. అయితే కొన్ని దేశాల్లో మహిళల రక్షణ విషయంలో చట్టాలు ఎంత కఠినంగా వుంటాయో తెలియజేసే సంఘటన ఒకటి బయటపడింది. 

సింగపూర్ దేశం మహిళల రక్షణ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ విషయం తెలియన చెల్లం రాజేష్ కన్నన్(26) అనే యువకుడు ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించి జైలుపాలయ్యాడు. 

రాజేష్ కు ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఓ మైనర్ బాలిక పరిచయమయ్యింది. పలుమార్లు బాలికను కలిసిన కన్నన్ ఆమెపై కన్నేశాడు. ఈ క్రమంలోనే బాలిక తన స్నేహితుల కోసం మద్యం తీసుకురావాల్సిందిగా రాజేష్ ని కోరింది. దీన్ని ఆసరాగా చేసుకుని బాలికను కలిసిన అతడు ఆమెను బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. అంతేకాకుండా తన లైంగిక వాంఛ తీర్చాలని బలవంతం చేశాడు. 

దీంతో బాలిక భయపడిపోయి అతడి నుండి తప్పించుకుని తల్లిదండ్రులు విషయాన్ని తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి కన్నన్ ను అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను బలవంతం చేసినందుకు గానూ అతడికి న్యాయస్థానం 7 నెలల జైలు శిక్ష విధించారు.  


 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ