లోయలో పడిన బస్సు...20మంది మృతి

Published : Dec 15, 2018, 03:32 PM IST
లోయలో పడిన బస్సు...20మంది మృతి

సారాంశం

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో 20మంది మృత్యువాతపడగా... మరో 17మంది తీవ్రగాయాలపాలయ్యారు.


నేపాల్ లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో 20మంది మృత్యువాతపడగా... మరో 17మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఖాట్మాండ్ సీమీపంలోని నువాకోట్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అధికారుల సమాచారం ప్రకారం.. గయాంగడండా ప్రాంతంలో కొండపై నుంచి వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి 100మీటర్ల లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. బస్సులో పరిమితికి మించి ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిఉటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ