కుప్పకూలిన విమానం.... ప్రమాదంలో 100మంది ప్రయాణికులు

Published : Dec 27, 2019, 10:00 AM ISTUpdated : Dec 27, 2019, 10:39 AM IST
కుప్పకూలిన విమానం.... ప్రమాదంలో 100మంది ప్రయాణికులు

సారాంశం

ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు అయితే... తొమ్మిది మృతదేహాలు బయటపడ్డాయి. మిగిలినవారంతా విమాన శకాలల కిందే పడి ఉన్నారని అధికారులు చెబుతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.

కజకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆల్ మటీ నగరంలోని విమానాశ్రయం నుంచి బయలుదేరిన బెక్ ఎయిర్ కు చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 100మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

వీరీలో 95మంది ప్రయాణికులు కాగా... మిగిలిన ఐదుగురు విమాన సిబ్బంది. కాగా.... ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు అయితే... తొమ్మిది మృతదేహాలు బయటపడ్డాయి. మిగిలినవారంతా విమాన శకాలల కిందే పడి ఉన్నారని అధికారులు చెబుతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.

కొందరికి తీవ్రగాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా... విమానం టేకాఫ్ అయిన కొద్ది సమయానికే సమీపంలోని రెండంతస్థుల భవనాన్ని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఆల్ మటీ నుంచి దేశ రాజధాని నూర్-సుల్తాన్ కు బయలుదేరిన కొద్దిసేపటికే విమానం నుంచి రాడార్ సంకేతాలు తెగిపోయాయి.  దీంతో రంగంలోకి దిగిన అధికారులు విమానాశ్రయానికి సమీపంలోనే కుప్పకూలినట్లు గుర్తించారు. కాగా.... ఈ ఘటనకు సంబంధించిన ప్రభుత్వం ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కమిషన్ ను నియమిస్తామని తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Fake Doctors : పాకిస్థాన్ మొత్తం శంకర్ దాదా ఎంబిబిఎస్ లే.. ఎంతమంది నకిలీ డాక్టర్లున్నారో తెలుసా?
భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ వదులుకున్న భర్త.. కోర్టు ఆసక్తికర తీర్పు