పాక్‌లో హిందూ దేవాలయం కూల్చివేత: ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం

By Siva KodatiFirst Published Feb 7, 2019, 7:58 AM IST
Highlights

పాకిస్తాన్‌లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించాయి. సింధ్ ప్రావిన్స్‌లో హిందూ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఖైర్‌పూర్ జిల్లాలోని కుంబ్‌లోని శ్యామ్‌సేవా దేవాలయాన్ని ధ్వంసం చేసి కృష్ణుడు ఇతర విగ్రహాలు, మత గ్రంథాలకు నిప్పు పెట్టారు. 

పాకిస్తాన్‌లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించాయి. సింధ్ ప్రావిన్స్‌లో హిందూ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఖైర్‌పూర్ జిల్లాలోని కుంబ్‌లోని శ్యామ్‌సేవా దేవాలయాన్ని ధ్వంసం చేసి కృష్ణుడు ఇతర విగ్రహాలు, మత గ్రంథాలకు నిప్పు పెట్టారు.

ఈ చర్యను నిరసిస్తూ సింధ్ ప్రావిన్స్‌లోని పలు హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై ఖైర్‌పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు ఈ విషయం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దృష్టికి వెళ్ళడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఖురాన్‌కు వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సింధ్ ప్రావిన్స్ అధికారులను ఆదేశించారు.

పాక్‌ జనాభాలో సుమారు 2 శాతం మంది హిందువులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లోనే నివసిస్తున్నారు. మైనార్టీలుగా వున్న వీరిపై అతివాదులు వేధింపులకు పాల్పడటం, దేవాలయాలు ధ్వంసం చేయడం ఆనవాయితీగా మారింది. 

click me!