మసీదులో జీహాద్ కు మద్దతుగా రాడికల్ ప్రసంగాలు.. ఫ్రాన్స్ ప్రభుత్వం కఠిన నిర్ణయం..

Published : Dec 29, 2021, 01:33 PM IST
మసీదులో జీహాద్ కు మద్దతుగా రాడికల్ ప్రసంగాలు.. ఫ్రాన్స్ ప్రభుత్వం కఠిన నిర్ణయం..

సారాంశం

ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతంలో ఉన్న బోవెలో ఓ మసీదు ఉంది. ఇక్కడికి వచ్చే ముస్లింలకు ఇమామ్ మతపరమైన బోధనలు చేస్తున్నారు. జీహాద్ కు పాల్పడేవారిని హీరోలుగా కీర్తిస్తూ, హింసను రెచ్చగొడుతున్నారు. ఈ ఇమామ్ క్రమం తప్పకుండా మతపరమైన బోధనలు చేస్తున్నప్పటికీ, తాను అప్పుడప్పుడూ ప్రసంగించే వక్తనని చెప్పుకుంటున్నారు.

పారిస్ : పవిత్ర యుద్ధం (Jihad) కు మద్దతుగా Radical speeches, మతపరమైన బోధనలు చేయడంతో ఓ మసీదును Government of France మూసేసింది. ఆరు నెలల పాటు దీనిని తెరవకూడదని ఆదేశించింది. ఉగ్రవాదం, తీవ్రవాదాలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో Islamic place of worshipల్లో తనిఖీలు నిర్వహిస్తోంది.

ఫ్రాన్స్ హోం మంత్రిత్వ శాఖ అధికారిని ఉటంకిస్తూ, బ్రిటిష్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతంలో ఉన్న బోవెలో ఓ మసీదు ఉంది. ఇక్కడికి వచ్చే ముస్లింలకు ఇమామ్ మతపరమైన బోధనలు చేస్తున్నారు. జీహాద్ కు పాల్పడేవారిని హీరోలుగా కీర్తిస్తూ, హింసను రెచ్చగొడుతున్నారు. ఈ ఇమామ్ క్రమం తప్పకుండా మతపరమైన బోధనలు చేస్తున్నప్పటికీ, తాను అప్పుడప్పుడూ ప్రసంగించే వక్తనని చెప్పుకుంటున్నారు.

దేశంలోని చట్టాల కన్నా ఇస్లాం ఆచరణకే పెద్దపీట వేయాలని, ఇస్లాం నిబంధనలే అన్నిటికన్నా గొప్పవని చెప్తున్నారు. బోవే మసీదును మూసివేసే ప్రక్రియను అంతకు ముందు ఫ్రాన్స్ హోం మంత్రి గెరాల్డ్ డర్మనిన్ ప్రారంభించారు. క్రైస్తవులు, స్వలింగ సంపర్కులు, యూదులను లక్ష్యంగా చేసుకుని ఈ మసీదులో రాడికల్ బోధనలు చేస్తున్నారని ఆరోపించారు. 

సూడాన్ లో మూసివేసిన బంగారు గని కూలి.. 38మంది మృతి...
ఇదిలా ఉండగా, బ్రిటన్  రాణి Queen Elizabeth (95)ను murder attempt చేయడానికి ప్రయత్నించిన 19 ఏళ్ల యువకుడిని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాను indian sikhనని, తన పేరు జశ్వంత్ సింగ్ ఛాయిల్ అని అతను చెప్పుకొచ్చాడు. 1919 లో జరిగిన Jallianwala Bagh మారణకాండకు ప్రతీకారంగా రాణి హత్య చేయదలచినట్టు పేర్కొన్నాడు.

 ఈ మేరకు స్నాప్ చాట్ లో వీడియో పెట్టాడు.  దీనిని చిత్రీకరించిన సమయంలో పూర్తిగా ముసుగు ధరించి ఉన్నాడు అతని మానసిక స్థితి పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. అతడిని ప్రస్తుతం మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి విండ్సర్ క్యాజిల్ రాజ ప్రసాదానికి క్వీన్ ఎలిజబెత్ వెళ్లారు. శనివారం ఆ యువకుడు అక్కడికి వెళ్లాడు.

 చేతిలో విల్లు లాంటి క్రాస్ బౌ ఆయుధం కూడా ఉంది.  రాణి నివాసం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు 24 నిమిషాల ముందు తీసుకున్న వీడియోను ఆ యువకుడు స్నాప్ చాట్ లో పెట్టాడు. ‘ నన్ను క్షమించండి.  నేను చేసిన దానికి, చేయబోయే దానికి  క్షమించండి. రాజ కుటుంబానికి చెందిన క్వీన్ ఎలిజబెత్ ను హత్య చేస్తాను. 1919 లో జరిగిన జలియన్వాలా బాగ్ మారణకాండకు ఇది ప్రతీకారం.

జాతి పేరుతో వివక్షకు గురై ప్రాణాలు కోల్పోయిన  వారి తరఫున పగ సాధిస్తాను.  నేను భారతీయ సిక్కును.  నా పేరు జస్వంత్ సింగ్ ఛాయిల్- డార్త్ జోన్స్’ అని అందులో పేర్కొన్నాడు. స్టార్ వార్ సినిమా లో ఓ ముసుగు మనిషి నల్లని ఆయుధాన్ని పట్టుకొని భయానక గొంతుతో మాట్లాడినట్టుగా ఈ వీడియో అనిపించింది.  దీన్ని తన ఫాలోవర్స్ కు పంపించాడు.

దాంతో పాటుగా ఓ సందేశం పెట్టాడు. ‘తప్పు చేసినందుకు, అబద్ధాలు ఆడినందుకు క్షమించండి. ఈ వీడియో మీరు అందుకున్నారంటే నా చావు దగ్గర పడినట్టే లెక్క. అవకాశం ఉంటే దీనిని షేర్ చేయండి. ఆసక్తి ఉంటే దీన్ని వార్త ప్రసారం చేయండి. అంటూ అందులో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి సౌతాంప్టన్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. పోలీసులు అక్కడికి వెళ్లి సోదాలు జరిపి ఒక క్రాస్ బౌ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Benjamin Netanyahu : ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఏం చదువుకున్నారో తెలుసా?
Iran Israel War : దుబాయ్ లో 19 మంది భారతీయులు అరెస్ట్.. అసలేం జరుగుతోంది?