భద్రతా మండలిలో కాశ్మీర్ అంశం: 1965 తర్వాత నేడు మరోసారి

Published : Aug 16, 2019, 06:26 PM ISTUpdated : Aug 16, 2019, 06:29 PM IST
భద్రతా మండలిలో కాశ్మీర్ అంశం: 1965 తర్వాత నేడు మరోసారి

సారాంశం

జమ్మూ కాశ్మీర్  అంశంపై యూఎన్ భద్రతా మండలిలో శుక్రవారం నాడు చర్చించనున్నారు. 1965లో జమ ్మూ కాశ్మీర్ అంశంపై తొలుత చర్చించారు. 

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారంనాడు చర్చించనుంది. పాకిస్తాన్, చైనా వినతి మేరకు భద్రతా మండలి ఈ నిర్ణయం తీసుకొంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ఈ విషయమై క్లోజ్డ్ డోర్స్ మధ్య జరగనుంది. 1965లో పూర్తిస్థాయి భద్రతా మండలి సమావేశంలో కాశ్మీర్ అంశంపై చర్చించారు.

ఆ తర్వాత ఇదే అంశంపై భద్రతా మండలిలో ఇవాళ చర్చించనున్నారు. ఇవాళ పూర్తిస్థాయి భద్రతా మండలి ఈ అంశంపై చర్చించదని భద్రతా మండలి వర్గాలు ప్రకటించాయి.

జమ్మూ కాశ్మీర్ అంశంపై చర్చించాలని  పాక్ తో పాటు చైనా కూడ  కోరిందని ఐక్యరాజ్యసమితి భద్రతా వర్గాలు తెలిపాయి. క్లోజ్డ్ డోర్స్ సమావేశం నిర్వహించాలని  చైనా కోరినట్టుగా ఆ వర్గాలు ప్రకటించాయి.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.ఈ నిర్ణయం పాక్ కు మింగుడపడడం లేదు. 

ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇదివరకు ఐక్యరాజ్యసమితి కార్యదర్శిని పాక్ కోరింది.ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఐక్యరాజ్యసమితి పాక్ కు తేల్చి చెప్పింది.

PREV
click me!

Recommended Stories

ఇక్క‌డ ఎన్ని అణు బాంబులు ప‌డ్డా ఏం కాదు.. ప్ర‌పంచంలో అత్యంత భ‌ద్ర‌మైన దేశం ఏదో తెలుసా?
Iran Israel War : ఇండియాను తాకిన ఇరాన్-ఇజ్రాయెల్ వార్ సెగ.. విశాఖవాసులు బిగ్ షాక్