
జపాన్లో భూకంపం: జపాన్ లో భూకంప సంభవించింది. హక్కైడో ద్వీపం యొక్క తూర్పు భాగంలో శనివారం (ఫిబ్రవరి 25) సాయంత్రం బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఈ మేరకు యూఎస్జీసీ అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:27 గంటలకు భూకంపం సంభవించింది. అంతకుముందు ఫిబ్రవరి 20న జపాన్లో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది.
టర్కీలో మళ్లీ భూకంపం
మరోవైపు.. శనివారం (ఫిబ్రవరి 25) టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైంది. యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. "భూకంపం యొక్క కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ఫిబ్రవరి 6 న సంభవించిన 3 భూకంప ప్రకంపనలలో సుమారు 48 వేల మంది మరణించారు." అని పేర్కొంది.
పాకిస్థాన్ లో భూ ప్రకంపనాలు
నిన్న శుక్రవారం (ఫిబ్రవరి 24) పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో భూకంపం సంభవించింది. ఉదయం 6 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్థానిక మీడియా పేర్కొంది.
ఉత్తరాఖండ్లో పొంచి ఉన్న పెను భూకంపం
ఇదిలా ఉంటే.. ఉత్తరాఖండ్లో పెను భూకంపం వచ్చే ప్రమాదం ఉందని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఎప్పుడు వస్తుందనే దానిపై స్పష్టత లేనప్పటికీ. భూకంపం ఏ సమయంలో వస్తుందో చెప్పగల సాంకేతికత ప్రపంచంలో ఏదీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.