ఫిలిఫ్పిన్స్‌లో భూకంపం

By narsimha lodeFirst Published Apr 22, 2019, 5:09 PM IST
Highlights

సెంట్రల్ ఫిలిప్ఫిన్స్‌లో సోమవారం నాడు  భూ కంపం సంభవించింది. భూకంపలేఖినిపై 6.3 గా భూకంప తీవ్రత నమోదైంది.
 

మనీలా: సెంట్రల్ ఫిలిప్ఫిన్స్‌లో సోమవారం నాడు  భూ కంపం సంభవించింది. భూకంపలేఖినిపై 6.3 గా భూకంప తీవ్రత నమోదైంది.

 మనీలాకు 60 కి.మీ దూరంలో  భూకంప కేంద్రం ఉన్నట్టుగా భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.భూకంప తీవ్రతకు పంపంగ రాష్ట్రంలో ఓ చర్చి ధ్వంసమైనట్టుగా సమాచారం అందుతోంది.

మరో వైపు ఓ పర్వతంపై ఉన్న బండరాళ్లు రహాదారికి అడ్డంగా పడడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారినట్టుగా అధికారులు చెబుతున్నారు. వందలాది మంది ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుండి  భయంతో పరుగులు తీశారు.

click me!