ఇండోనేషియా విమాన ప్రమాదం: బ్లాక్ బాక్సులు గుర్తింపు

Published : Jan 10, 2021, 05:17 PM ISTUpdated : Jan 10, 2021, 05:18 PM IST
ఇండోనేషియా విమాన ప్రమాదం: బ్లాక్ బాక్సులు గుర్తింపు

సారాంశం

సముద్రంలో కుప్పకూలిన ఇండోనేషియా విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్సుల ఆచూకీని అధికారులు కనుగొన్నారు.

జకార్తా: సముద్రంలో కుప్పకూలిన ఇండోనేషియా విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్సుల ఆచూకీని అధికారులు కనుగొన్నారు.

బ్లాక్ బాక్సుల సిగ్నల్స్ ను గుర్తించారు. ఈ బ్లాక్ బాక్సులను వెలికితీసే పనిలో అధికారులున్నారు. జకార్తాలో విమానం బయలుదేరిన కొంత సేపటికే విమానం కుప్పకూలిపోయింది.

ఎస్‌జే 182 విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రాడార్ నుండి అదృశ్యమైంది. ఆదివారం నాడు ఉదయం లాంకాంగ్, లకీ ద్వీపాల మధ్య ఈ విమాన శకలాలు, మనుషుల శరీర భాగాలు, దుస్తులు తదితర వస్తువులు లభ్యమయ్యాయి.

శ్రీ విజయ ఎయిర్ కు చెందిన జెట్ విమానంలో ఏడుగురు చిన్నారులు, ముగ్గురు శిశువులతో పాటు 62 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదానికి కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
POK లో రక్తపాతం.. 19 మంది పిల్లలు, ఏడుగురు గర్భిణీల మృతి.. షాకింగ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్