ఇండోనేషియాలో సముద్రంలో కూలిన విమానం.. విమానంలో 200 మంది

sivanagaprasad kodati |  
Published : Oct 29, 2018, 08:44 AM ISTUpdated : Oct 29, 2018, 11:37 AM IST
ఇండోనేషియాలో సముద్రంలో కూలిన విమానం.. విమానంలో 200 మంది

సారాంశం

ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. జకార్తా నుంచి పినాంగ్ వెళుతున్న లయన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. 

ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 188 మందితో జకార్తా నుంచి పినాంగ్‌కు వెళుతున్న లయన్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అయిన 13 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి.

అదృశ్యమైన విమానం కోసం ఎయిర్‌ఫోర్స్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జావా సముద్ర తీరంలో విమాన శకలాలు గుర్తించినట్లు వారు ప్రకటించారు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 181 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది సహా 188 మంది దుర్మరణం పాలైనట్లునని భావిస్తున్నారు. మరోవైపు ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

PREV
click me!

Recommended Stories

పేరుకే పెద్ద‌న్న, బుద్ధి మాత్రం.. హైద‌రాబాద్ చిలుకూరు ఆల‌యంపై అమెరికా సెనేట‌ర్ వివాద‌స్ప‌ద వ్యాఖ్యలు
USA: అమెరికాలో వెలుగులోకి మ‌రో స్కామ్‌.. భార‌తీయ విద్యార్థుల్లో ఆందోళ‌న‌, అస‌లేం జ‌రుగుతోంది.?