కాబూల్ లో ఆత్మాహుతి దాడి... నలుగురు మృతి

By telugu teamFirst Published May 31, 2019, 4:23 PM IST
Highlights

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. శుక్రవారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. శుక్రవారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.  ఓ అంతర్జాతీయ సంస్థకు చెందిన వాహనాల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడిలో నలుగురు ఆఫ్ఘన్‌లు మరణించగా, మరో నలుగురు అమెరికాసైనికులు గాయపడ్డారు. 

కాబూల్ నగరంలోని ఖాలా ఏ వజీర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, గురువారం మిలటరీ ట్రైయినింగ్ అకాడమీ బయట ఐసిస్ తీవ్రవవాదులు జరిపిన బాంబు దాడిలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. 

click me!