పాక్‌లో బాంబు పేలుడు: 14 మంది మృతి

By narsimha lodeFirst Published Apr 12, 2019, 12:54 PM IST
Highlights

పాకిస్తాన్‌లోని క్వెట్టాలో శుక్రవారం నాడు బాంబు పేలుడులో 14 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
 


కరాచీ: పాకిస్తాన్‌లోని క్వెట్టాలో శుక్రవారం నాడు బాంబు పేలుడులో 14 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

 క్వెట్టాలోని హజర్‌గంజీ ఏరియాలో బాంబు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఇప్పటికే 14 మంది మృతి చెందారు.అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

బాంబు ధాటికి  సమీపంలోని భవనాలు కూడ ధ్వంసమైనట్టుగా పోలీసులు చెప్పారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
 

click me!