టీఎస్ఆర్టీసి సమ్మె: హైదరాబాదులో అదనపు మెట్రో రైళ్లు ఇలా...

By telugu teamFirst Published Oct 5, 2019, 7:16 AM IST
Highlights

టీఎస్ఆర్టీసి కార్మికుల సమ్మె నేపథ్యంలో మెట్రో రైలు యాజమాన్యం హైదరాబాదులో అదనపు రైళ్లను నడుపుపతోంది. మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ఎస్ రెడ్డి ఎల్ అండ్ టీ అధికారులతో చర్చించి తగిన ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్: ప్రతిపాదిత ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో  ప్రయాణీకుల  అదనపు రద్దీని తీర్చడానికి మెట్రో రైలు యాజమాన్యం తగిన చర్యలు తీసుకుంది. మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ఎస్ రెడ్డి ఎల్ అండ్ టి ఎంఆర్ హెచ్ఎల్ ఎండి మిస్టర్ కెవిబి రెడ్డితో చర్చలు జరిపారు. సిఒఒ అనిల్ సైని,హెచ్ఎంఆర్ఎల్ డిసిపి  ఎ బాలకృష్ణ కూడా ఈ అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు.

శుక్రవారం జరిగిన ఆ అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ కింది ఏర్పాట్లు చేస్తున్నారు.

1. మెట్రో రైళ్లు ఉదయం 5 గంటల నుండి ప్రారంభమయ్యే రైళ్లతో  చివరి రైలు రాత్రి 11.30 గంటలకు టెర్మినల్ స్టేషన్ల నుండి బయలుదేరి ఇతర టెర్మినల్ స్టేషన్లకు తెల్లవారుజామున 12.30 గంటలకు చేరుకుంటుంది;. 

2. గరిష్ట గంటలలో రైళ్లు 3 నిమిషాలకు, 5 నిమిషాలకు లేదా పీక్ కాని సమయంలో అవసరానికి అనుగుణంగా పెంచడం 

3. అదనపు టికెట్ కౌంటర్లు, యంత్రాలు, సిబ్బందిని  బిజీ స్టేషన్లలో ఏర్పాటు చేయడం

4. ఎల్ అండ్ టిఎంఆర్ హెచ్ఎల్ యొక్క సీనియర్ అధికారులు రద్దీని నిర్వహించడానికి ఎల్బి నగర్, అమీర్ పేట్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్ ఈస్ట్, పరేడ్ గ్రౌండ్స్ వంటి ముఖ్యమైన స్టేషన్లను విధులు నిర్వహిస్తారు.

క్రమశిక్షణను పాటించాలని, క్యూ విధానాన్ని అనుసరించాలని ఎన్వీఎస్ఎస్ రెడ్డి ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. మహిళలు, పిల్లలు, పెద్దలు, పేదలకు సహాయపడాలని కోరారు. భద్రతా జాగ్రత్తలు పాటించాలని కూడా విజ్ఞప్తి చేశారు. 

స్మార్ట్ కార్డుల కొనుగోలు టికెట్ కౌంటర్ల వద్ద పొడవైన క్యూలను నివారించడానికి సహాయపడుతుందని సూచించారు.  

భయం అవసరం లేదని, ప్రయాణికులకు భద్రత ఉంటుందని, స్టేషన్ సిబ్బంది అవసరమైన సహాయం అందిస్తారని ఆయన చెప్పారు.

click me!