అల్లు అర్జున్ తో మహానటి...భారీ ప్లాష్ బ్యాక్

By Surya PrakashFirst Published Nov 8, 2021, 6:51 AM IST
Highlights

 బన్ని నెక్ట్స్ మూవీ ఎవరితో చేస్తారు అనేది మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  మాస్ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిన బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఫైనల్ అయ్యిందని సమాచారం.  

 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాను రెండు పార్టులుగా చేసి రిలీజ్ చేస్తూండటంతో కాస్త లోడ్ ఎక్కువగానే ఉంది.  ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్  రకరకాల కారణాలతో వాయిదా పడ్డది. మరో ప్రక్క ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్న వేణు శ్రీరాం తో ఐకాన్ మూవీ కూడా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉన్నా ఆగిపోయింది. 

ఈ నేపధ్యంలో బన్ని నెక్ట్స్ మూవీ ఎవరితో చేస్తారు అనేది మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే  మాస్ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిన బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఫైనల్ అయ్యిందని సమాచారం. గతంలో బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సూపర్ హిట్ కాగా మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ రానుంది. 

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఫైనల్ అయినట్టు టాక్. సరేనోడు సినిమాలో రకుల్ క్యారక్టర్ కు ఉన్నట్లే ఈ సినిమాలోనూ కీర్తి సురేష్ కు ప్రాధాన్యత ఉంటుందని, ఆమె కు ఓ భారీ ప్లాష్ బ్యాక్ ఉండబోతోందని చెప్పుకుంటున్నారు. ఆమె పాత్రకు ప్రయారిటి ఉంటుందని, అదే సినిమాకు ప్లస్ అవుతుందని చెప్తున్నారు.

Also read Viswa Eliminated: బిగ్‌ బాస్ ‌5లో బిగ్‌ షాక్‌.. షణ్ముఖ్‌, రవి, ప్రియాంక, శ్రీరామ్‌లపై విశ్వ హాట్‌ కామెంట్‌

 ఇక  మహానటి సినిమాతో సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తుంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా కూడా చేస్తుంది.ఆ సినిమాలో కీర్తి సురేష్ సిస్టర్ రోల్ లో నటిస్తుందని తెలిసిందే. ఇక అల్లు అర్జున్ తో కీర్తి సురేష్ మొదటిసారి జోడీ కడుతుంది ఈ కాంబో సరైనోడిని మించి సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

Also read Kamal Haasan Birthday: ఇండియన్‌ సినిమాకి ఒకే ఒక్కడు కమల్‌కి ఇన్ని పేర్లా?.. వైరల్‌గా ఆస్తులు.. ఇంట్రెస్టింగ్‌
 

click me!