మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల హావభావాలు (ఫొటోలు)

First Published Jul 16, 2021, 9:40 PM IST

పార్టీ ప్రకటన తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. శుక్రవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో ఆమె పాత్రికేయులతో ముచ్చటించారు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకి కాదన్నారు షర్మిల.. తెలంగాణకు వైఎస్ మంచి చేశారా? ద్రోహం చేశారా అనేది గ్రామాలకు వెళ్లి ప్రజలను అడగాలని ఆమె కోరారు. ఇది నా గడ్డ.. తెలంగాణ కోసం పోరాటం చేయడానికి వచ్చినట్టుగా ఆమె చెప్పారు.
undefined
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకి కాదన్నారు షర్మిల.. తెలంగాణకు వైఎస్ మంచి చేశారా? ద్రోహం చేశారా అనేది గ్రామాలకు వెళ్లి ప్రజలను అడగాలని ఆమె కోరారు. ఇది నా గడ్డ.. తెలంగాణ కోసం పోరాటం చేయడానికి వచ్చినట్టుగా ఆమె చెప్పారు.
undefined
తనది విబేధించి పెట్టిన పార్టీ కాదన్నారు. ప్రజలపై ప్రేమతో పెట్టిన పార్టీగా షర్మిల తెలిపారు.తన కోసం పార్టీ పెట్టలేదన్నారు. తెలంగాణలో పార్టీ అవసరం ఉన్నందునే పార్టీ ఏర్పాటు చేసినట్టుగా ఆమె చెప్పారు.
undefined
తానున్నా లేకున్నా ఇక్కడ పార్టీ కొనసాగాలనేది తన అభిమతమన్నారు షర్మిల .తెలంగాణ ప్రజల గురించి తాము మొదటి నుండి పోరాటం చేస్తున్నామన్నారు. తెలంగాణలో పార్టీ అవసరమని భావించి పార్టీ ఏర్పాటు చేసినట్టుగా ఆమె చెప్పారు.
undefined
హుజూరాబాద్ ఎన్నికలు ఇప్పుడు అవసరమా అని షర్మిల ప్రశ్నించారు.హుజూరాబాద్ ఉప ఎన్నికతో ఏం వస్తోందని ఆమె అడిగారు.రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే హుజూరాబాద్‌లో పోటీ చేస్తామన్నారు.హుజూరాబాద్ ఉప ఎన్నికలకు అర్ధమే లేదన్నారు.
undefined
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగానే హుజురాబాద్ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయని తనతో పాటు ఉన్న పార్టీ నేతలను షర్మిల నవ్వుతూ ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు వచ్చిన తీరుపై ఆమె సెటైరికల్ గా స్పందించారు.
undefined
ఈ ఎన్నికలతో ప్రజలకు ఏం ఒరుగుతోందని షర్మిల ప్రశ్నించారు. ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటే పోటీ చేసేందుకు తాము సిద్దమని ఆమె చెప్పారు.
undefined
టీఆర్ఎస్ లో మహిళలకు గౌరవం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. కేటీఆర్ దృష్టిలో మహిళలంటే వ్రతాలు చేసుకోవాలి, వంటింట్లో ఉండాలన్నారు. మీటింగ్ జరిగితే మహిళా సర్పంచ్ కు కనీసం కుర్చీ కూడా ఇవ్వరన్నారు.
undefined
నిరుద్యోగుల కోసం అన్నం మెతుకు ముట్టుకోకుండా మేం వత్రం చేస్తున్నామన్నారు షర్మిల. పెద్ద మొగోడు కదా .... కేటీఆర్ ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటిని భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తే మా వ్రతం ఫలించిందనుకొంటానని షర్మిల చెప్పారు.
undefined
కృష్ణా జలాల అంశాలను కేసీఆర్‌ ఏనాడైనా సీరియస్‌గా తీసుకున్నారా షర్మిల అడిగారు. సమావేశాలకు పిలిస్తే పోవాల్సిన బాధ్యత లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిబొట్టును వదులుకోమని స్పష్టం చేశారు.
undefined
తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తాను అలిగినట్లు జరుగుతున్న ప్రచారంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చారు.
undefined
అదే సమయంలో కృష్ణా జలాల వివాదంపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఏపీ సీఎం జనగ్ మీద తాను అలిగి పార్టీ పెట్టానని కొందరు అంటున్నారని, అది సరి కాదని, అలిగితే మాట్లాడడం మానేస్తారు గానీ పార్టీ పెడుతారా అని ఆమె అన్నారు.
undefined
click me!