హుజూర్ నగర్: సిపిఐతో పొత్తు వెనక ఆయనే.. గుత్తా సైతం కీలకమే..

First Published Oct 3, 2019, 5:42 PM IST

హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  విజయం కోసం టీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నాలను చేస్తోంది. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.

ఈ నెల 21వ తేదీన జరగనున్న హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించేందుకు టీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. సైదిరెడ్డిని గెలిపించే బాధ్యతను మంత్రి జగదీష్ రెడ్డి తీసుకొన్నారు.
undefined
2009 నుండి వరుసగా మూడు దఫాలుగా హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా ఈ స్థానంలో విజయం సాధించడం కోసం టీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
undefined
హుజూర్‌నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి గెలుపు బాధ్యతను జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి తన మీద వేసుకొన్నారు. ఈ నియోజకవర్గంలో సుఖేందర్ రెడ్డి ప్రభావం కూడ ఉంటుంది.
undefined
సుఖేందర్ రెడ్డి గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేసిన సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఆయనకు ఓ వర్గం ఉండేది. సుఖేందర్ రెడ్డి పార్టీ మారిన సమయంలో ఈ వర్గమంతా కూడ ఆయన వెంట పార్టీ మారేది.
undefined
హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నాలను చేస్తోంది. ఈ మేరకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రతి అవకాశాన్ని టీఆర్ఎస్ గెలుపు కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
undefined
ఈ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు కుదుర్చుకోవడం వెనుక మంత్రి జగదీష్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా టీఆర్ఎష్ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు గుత్తా సుఖేందర్ రెడ్డి హుజూర్‌ నగర్ నియోజకవర్గంలో ప్రభావం చూపేందుకు ప్రయత్నాలు చేశారని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలపై టీఆర్ఎస్ నేతలు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
undefined
రాజ్యాంగ పదవిలో ఉన్న సుఖేందర్ రెడ్డి ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రభావితం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది.
undefined
శాసనమండలి ఛైర్మెన్ పదవిలో సుఖేందర్ రెడ్డి లేకపోతే హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సుఖేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించేవాడని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
undefined
గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంలో సుఖేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.
undefined
click me!