దీక్షిత్ ను మందసాగర్ ఇలా కిడ్నాప్ చేశాడు (ఫొటోలు)

First Published Oct 22, 2020, 1:35 PM IST

సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో మంద సాగర్  అనే వ్యక్తి 9 ఏళ్ల దీక్షిత్ రెడ్డని హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.

ఈ నెల 18వ తేదీన దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసిన మంద సాగర్ మహబూబాబాద్ శివారులోని గుట్ట వద్దకు తీసుకెళ్లి హత్య చేశాడు. కిడ్నాప్ చేసిన గంటలోనే బాలుడిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
undefined
తమ కొడుకును విడిచిపెట్టాలని దీక్షిత్ తల్లిదండ్రులు వేడుకొన్నారు. కిడ్నాపర్ డిమాండ్ చేసినట్టుగా డబ్బులు కూడ సిద్దం చేశారు. ఈ డబ్బులను సిద్దం చేశాడు. ఈ మేరకు వీడియోను కూడ విడుదల చేశారు. కిడ్నాపర్ చెప్పినట్టుగా వాళ్లు చేసినా కూడ బాలుడు మాత్రం వారికి దక్కకుండాపోయాడు.
undefined
దీక్షిత్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గురువారం నాడు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మహబూబాబాద్ కు సమీపంలోని గుట్ట వద్ద దీక్షిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
undefined
దీక్షిత్ రెడ్డిని నిందితుడు మంద సాగర్ తన బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లాడు. సీసీటీవీలు లేని ప్రాంతాలను ఎంచుకొని తీసుకెళ్లాడు.ఒక్క చోట సీసీటీవీ ఉన్న విషయాన్ని గమనించకుండా ఆ రూట్లో వెళ్లడంతో ఈ దృశ్యాలను పోలీసులు గుర్తించారు.
undefined
దీక్షిత్ రెడ్డి మృతదేహం కుళ్లిపోయిన పరిస్థితిలో ఉంది. నాలుగు రోజులు దాటడంతో మృతదేహం గుర్తుపట్టని స్థితికి చేరుకొంది.
undefined
click me!