సమాచారం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు: డీజీపీ కామెంట్స్ పై బండి సంజయ్

First Published Nov 27, 2020, 12:41 PM IST

హైద్రాబాద్‌‌లో మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని స్పష్టమైన సమాచారం ఉంటే... నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదో చెప్పాలని సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డిలను ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

హైద్రాబాద్‌‌లో మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని స్పష్టమైన సమాచారం ఉంటే... నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదో చెప్పాలని సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డిలను ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
undefined
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుర్మగూడ డివిజన్ లో శుక్రవారం నాడు ఆయన ప్రసంగించారు. ఈ విషయమై డీజీపీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రతి ఒక్కరికీ ‘ఉచితంగా కరోనా వ్యాక్సిన్’ పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
undefined
అర్హులైన పేదలందరికీ ‘డబుల్ బెడ్రూం’ ఇండ్లను నిర్మించి అందజేస్తామన్నారు. అర్హులైన ఏ ఒక్కరూ బాధపడాల్సిన అవసరం లేదు. బీజేపీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాలోని జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తామన్నారు. హెల్త్ కార్డ్స్ ను రెన్యువల్ చేయడంతోపాటు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కచ్చితంగా ఉచిత ట్రీట్ మెంట్ జరిగేలా చేస్తామని ఆయన ప్రకటించారు.
undefined
కరోనా వారియర్స్ గా అహర్నిశలు కృషి చేస్తున్న కార్మికులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని సొంత ఆటో నడిపే వారికి ఇన్సూరెన్స్, రిపేర్లు, ఫిట్ నెస్ అవసరాల కోసం ఏటా రూ. 7 వేల ఆర్దిక సాయం అందజేస్తామని ఆయన తెలిపారు.ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పథకం వర్తింపజేస్తామన్నారు.
undefined
కేసీఆర్ తన స్వార్థం కోసం యాగాలు చేస్తారన్నారు. కాషాయ వస్త్రాలు ధరిస్తే ప్రజలు గుర్తించరని సంజయ్ చెప్పారు.. దేశద్రోహ పార్టీ, హిందూ దేవుళ్లను దూషించే పార్టీ మజ్లిస్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగినప్పుడు నీవు ఎలాంటి హిందువో సమాజం అర్ధం చేసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
undefined
ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా హిందువైతే....పాతబస్తీలో బహిరంగ సభ పెట్టి దేశద్రోహ పార్టీ మజ్లిస్ అరాచకాలను ప్రజలకు వివరించాలని ఆయన సవాల్ విసిరారు.భాగ్య నగర్ నిరుద్యోగులను నట్టేట ముంచిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కులాలు, వర్గాలకు అతీతంగా ఒక్కటై ఓటుతో బుద్ది చెప్పాలని ఆయన కోరారు.
undefined
భయాందోళనలు సృష్టించి ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనకుండా సాక్షాత్తూ ముఖ్యమంత్రే కుట్ర చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్లాన్ కు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. జీహెచ్ఎంసీ ప్రజలెవరూ భయపడొద్దు. తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలని ఆయన కోరారు. . బీజేపీ అభ్యర్థులను గెలిపించి టీఆర్ఎస్ కు బుద్ది చెప్పండి
undefined
click me!