వేంకటేశ్వర స్వామి చిత్ర పటం లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించాలి. స్వామి వారికి తులసి దళం అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రతి శనివారం పూజా సమయంలో తులసి దళంలో అర్చన చేయాలి. తర్వాత దీపాలను వెలిగించాలి. తర్వాత స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి పండ్లు, పలారాలను సమర్పించాలి. మీరు నైవేధ్యం పెట్టాలనుకుంటే పులిహోర, పాయసం, పండ్లు, చక్కెర పొంగలి పెట్టొచ్చు.