భారతదేశం సంస్కృతి, సంప్రదాయం, పండుగల సుసంపన్నమైన దేశం. మన దేశంలో ఎన్నో పండుగలను అంగరంగవైభవంగా జరుపుకుంటారు. మనం జరుపుకునే ప్రతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన దేశంలో ఘనంగా సెలబ్రేట్ చేసుకునే పండుగల్లో దీపావళి ఒకటి. ఒక్క ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం.. వినాయకుడిని, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సౌభాగ్యం, అదృష్టం కలుగుతాయి. అంతేకాక ఈ పూజ శాంతి, సౌభాగ్యం,మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఈ ఏడాది దీపావళి పండుగను నవంబర్ అంటే ఈ నెల 12 న జరుపుకోబోతున్నాం. ఈ పర్వదినాన లక్ష్మీదేవిని, వినాయకుడిని కలిపి పూజిస్తారు. ఎందుకిలా పూజిస్తారని ఎప్పుడైనా ఆలోచించారా?