లెజండరీ నటుడు దిలీప్ కుమార్ జీవితంలోని మైలురాళ్లు.. ఇవే..

First Published Jul 7, 2021, 10:23 AM IST

ప్రముఖ బాలీవుడ్ ఆ కాలపు నటుడు దిలీప్ కుమార్ తన 98వ యేట అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర అనారోగ్యానికి గురై బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల చిత్రపరిశ్రమ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 
 

ప్రముఖ బాలీవుడ్ ఆ కాలపు నటుడు దిలీప్ కుమార్ తన 98వ యేట అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర అనారోగ్యానికి గురై బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల చిత్రపరిశ్రమ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
undefined
శ్వాససంబంధింతన సమస్యలతో ముంబైలోని ఓ ఆస్పత్రలో ఇటీవలే దిలీప్ కుమార్ చేరారు. అక్కడ ఆయనకు ‘ఫ్లూరల్ యాస్పిరేషన్’.. ఊపిరితిత్తుల్లో నీరు తొలగించడం ప్రక్రియను నిర్వహించారు. కానీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో ప్రాణాలు విడిచారు.
undefined
నిరుడు దిలీప్ కుమార్ సోదరులు అస్లాంఖాన్, ఇషాన్ ఖాన్ లు కరోనాతో మరణించారు. ఈ విషాదం నుంచి వారి కుటుంబం కోలుకోకముందే దిలీప్ కుమార్ కూడా కన్నుమూశారు.
undefined
దిలీప్ కుమార్ 1922 డిసెంబర్ 11న పాకిస్తాన్ లోని పెషావర్ లో జన్మించారు. ఆయన అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. బాంబే టాకీస్ యజమాని అతనికి దిలీప్ కుమార్ అని పేరు పెట్టారు. సినిమాల్లోకి రాకముందు దిలీప్ తండ్రితో కలిసి పండ్లు అమ్మేవారు. ఆ తర్వాత 1944లో జ్వర్ భాతా చిత్రంతో వెండితెర మీద ఎంట్రీ ఇచ్చారు.
undefined
1955లో ఆజాద్, దేవదాస్ సినిమాలతో బిగ్గెస్ట్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. 'ఆజాద్‌' ఆ దశాబ్దిలోనే అధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. ఆ తర్వాత వచ్చిన పౌరాణిక చిత్రం ‘మొఘల్-ఎ-ఆజామ్’ తో ఆయన ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఓ రకంగా చెప్పాలంటే 1944 నుంచి 1998 వరకు దిలీప్ కుమార్ చిత్రసీమను ఏలారనే చెప్పాలి.
undefined
దిలీప్ కుమార్ ఉత్తమనటుడిగా 8 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 1993లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు దక్కింది. 1994లో దిలీప్ కుమార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.
undefined
ఈ దిగ్గజ నటుడి సేవలను గుర్తంచిన ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సన్మానించింది. 1998లో దిలీప్ కుమార్ ను నిషాన్-ఇ-ఇంతియాజ్ అవార్డుతో పాక్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. 2000-2006 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ డిలీప్ కుమార్ సేవలందించారు.భారతీయ చిత్రసీమకు మెథడ్ యాక్టింగ్ టెక్నిక్ పరిచయం చేసిన ఆయన సినిమా రంగంలోనే గొప్ప నటుడిగా గుర్తింపు సాధించారు. సత్యజిత్ రే దిలీప్ కుమార్ ను అల్టిమేట్ మెథడ్ యాక్టర్ అని పిలిచేవారు. దిలీప్ కుమార్ తన తోటి నటి సైరా బానును వివాహం చేసుకున్నారు.
undefined
మధుమతి సినిమాతో పునర్జన్మ నేపథ్య సినిమాల ఒరవడికి శ్రీకారం చుట్టారు. రామ్ ఔర్ శ్యామ్ సినిమాతో కవలలుగా పుట్టి.. పుట్టగానే విడిపోయి ఆ తరువాతి కాలంలో కలిసేలాంటి కథల సినిమాలకు బీజం వేశారు. మొదటి సారి 1954లో ‘దాగ్’ సినిమాకు గానూ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు.
undefined
1940 లో, దిలీప్ కుమార్ పూణేలో డ్రై ఫ్రూట్స్ దుకాణం, క్యాంటీన్ నడిపేవారు. మూడేళ్ల తరువాత నటి దేవిక రాణి, ఆమె భర్త నటుడు-దర్శకుడు హిమాన్షు రాయ్ మిలటరీ క్యాంటీన్‌లో అతన్ని చూసి అతనిలోని స్పార్క్.. గమనించారు. అలా 1944 నాటి జ్వార్ భాటాలో హీరోగా నటించారు. రచయిత భగవతి చరణ్ వర్మ యూసుఫ్ ఖాన్ పేరును దిలీప్ కుమార్ గా మార్చారు.
undefined
దీదార్ (1951), డాగ్ (1952), దేవదాస్, ఆజాద్ (1955) లలో నాటకీయ పాత్రల శ్రేణి. 1958 లో, నటి వైజయంతిమలతో పునర్జన్మ, పగ నేపథ్య మధుమతి నటించారు. మొఘల్-ఎ-అజామ్ (1960) పురాణ పాత్రలో అలరించారు. దిలీప్ కుమార్ కు ట్రాజడీ కింగ్ అనే పేరు కూడా ఉంది. దిలీప్ నటించిన ఆన్ (1952), ఆజాద్ (1955) కోహినూర్ (1960) వంటి చిత్రాలలో గొప్ప విజయాన్ని సాధించాయి.
undefined
1957 లో వచ్చిన నయా దౌర్ లో, స్వతంత్ర భారతదేశంలో పారిశ్రామికీకరణను ఓ టాంగావాలా ఎలా ఎదుర్కున్నాడనే పాత్ర పోషించాడు. 1961 లో, తన సోదరుడు నాసిర్ ఖాన్‌తో కలిసి గంగా జమునాలో నిర్మించి, నటించాడు. 1967 లో రామ్ ఔర్ శ్యామ్ తో డబుల్ రోల్ పాత్రలకు తెరతీశాడు. ఇదే ఆ తరువాతి కాలంలో వచ్చి బ్లాక్ బస్టర్స్ సీతా ఔర్ గీతా, చాల్బాజ్ లకు ప్రేరణనిచ్చింది.
undefined
ఆ సమయంలో డేవిడ్ లీన్ ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’లో షెరీఫ్ అలీ పాత్రను దిలీప్ కుమార్ నిరాకరించినట్లు తెలిసింది. ఆ తరువాత ఈ పాత్రను ఈజిప్టు స్టార్ ఒమర్ షరీఫ్ పోషించారు. డెబ్బైలలో, రాజేష్ ఖన్నా సూపర్ స్టార్డమ్, అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ లుగా దూసుకురావడంతో దిలీప్ కుమార్ చరిష్మా కాస్త తగ్గింది.
undefined
ఐదేళ్ల విరామం తరువాత, మనోజ్ కుమార్, శశి కపూర్, హేమా మాలిని, షత్రుఘన్ సిన్హా లతో కలిసి క్రాంతి (1981) అనే సూపర్ హిట్ సినిమాతో మళ్లీ తెరమీదికి వచ్చారు. అప్పటివరకు హీరో పాత్రల్లో అలరించిన దిలీప్ దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నెమ్మదిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే రమేష్ సిప్పీ శక్తి (1982), యష్ చోప్రా మషాల్ (1984), సౌదాగర్ (1991) లాంటి సినిమాల్లో నటించారు. ఇందులో అతను రాజ్ కుమార్, మనీషా కొయిరాలాతో కలిసి నటించారు. 1998లో వచ్చిన ఖిలా దిలీప్ కుమార్ చివరి సినిమాగా చెప్పుకోవచ్చు.
undefined
దిలీప్ కుమార్.. వైజయంతిమల, మధుబాల, మీనా కుమారి, కామిని కౌషల్, నర్గీస్ ల జోడీలు హిట్ పెయిర్ లుగా పేరొందాయి. ముఖేష్, తలాత్ మెహమూద్, కిషోర్ కుమార్, మొహద్ రఫీ లు అతనికి ప్లేబ్యాక్ పాడారు.
undefined
సహనటి మధుబాలతో ప్రేమ, రహస్య వివాహం అనేది అప్పట్లో బాలీవుడ్ ను షేక్ చేసింది. అయితే పెద్దలు ఒప్పుకోకపోవడంతో 1966 లో, దిలీప్ కుమార్ నటి సైరా బానును వివాహం చేసుకున్నారు. సైరాబాను దిలీప్ కుమార్ తో గోపి, బైరాగ్ వంటి చిత్రాలలో నటించారు.
undefined
click me!