దరఖాస్తు, ఎంపిక ప్రక్రియ :
ప్రస్తుతం ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల అంటే 2024 డిసెంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి వుంటుంది. పరీక్ష కోసం రూ.500 ఫీజు చెల్లించాలి... రాతపరీక్షకు హాజరైన విద్యార్థులకు రూ.400 రీఫండ్ చేస్తారు. ఎస్సి, ఎస్టి విద్యార్థులకు ఈ ఫీజు కేవలం రూ.250 మాత్రమే... వీరికి కూడా రీఫండ్ లభిస్తుంది.
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు. రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు వుంటుంది. ఇందులో 60 మార్కులు అబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఓ వ్యాసం (Essay) వుంటుంది. మిగతా 40 మార్కులు స్కౌట్ ఆండ్ గైడ్స్ కు సంబంధించి వుంటాయి.