బిజెపి కార్పోరేటర్లతో... చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో బండి సంజయ్
First Published Dec 18, 2020, 12:32 PM ISTహైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించిన నేపథ్యంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఎన్నికల్లో బిజెపి తరపున విజయం సాధించిన కార్పోరేటర్లందరితో కలిసి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ క్రమంలో కార్పోరేటర్లతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు.