ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట, సీతారామం.. 2022లో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపిన తెలుగు సినిమాలివే!

First Published Dec 18, 2022, 3:09 PM IST

2022లో బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు దుమ్ములేపాయి. బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలుగా నిలవడమే కాకుండా.. కాసుల వర్షం కురిపించాయి. చిన్న సినిమాలు కూడా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఆశ్చర్యపరిచాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటనేవి చూద్దాం. 
 

ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ ఏడాది దుమ్ములేపిన మొదటి తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). 2022లోప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లోనే రెండో స్థానంలో నిలిచింది. రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తెలుగు ఇండస్ట్రీలో మరో రికార్డు క్రియేట్ చేసింది. రెస్పాన్స్ లోనూ వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసి ఆస్కార్ బరిలో నిలిచింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఉద్యమ వీరుల పాత్రలను పోషించారు. ఈ ఏడాది మార్చి  25న పాన్ ఇండియా ఫిల్మ్ గా ఈ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
 

2022లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వసూళ్లను రాబట్టిన చిత్రాలలో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన ‘సర్కారు వారి పాట’ కూడా చేరింది. సమ్మర్ కానుగా వచ్చిన ఈ యాక్షన్ ఫిల్మ్ స్లోగా మొదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. వరల్డ్ వైడ్ రూ.230 కోట్ల గ్రాస్ వసూల్ చేసి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాతి స్థానం దక్కించుకుంది. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. మే 12న విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  నటించిన ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. విడుదలైన చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించడంతో పాటు కలెక్షన్లలోనూ మంచి జోష్ ను చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.193 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి మూడో తెలుగు చిత్రంగా నిలిచినట్టు ట్రెడ్ వర్గాల నివేదికలు తెలుపుతున్నాయి. ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్, నిత్యా మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. 

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas)- పూజా హెగ్దే జంటగా నటించిన చిత్రం రాధే శ్యామ్ (Radhe Shyam). మార్చి 11న విడుదలైన ఈ చిత్రం రెస్పాన్స్ పరంగా డిజాస్టర్ అనిపించుకుంది. కానీ ప్రభాస్ క్రేజ్ తో సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టగలిగింది. రూ.350 కోట్ల వరకు ఖర్చు చేయగా.. రూ.150 నుంచి 220 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ రకంగా ఎక్కువ వసూళ్లు రాబట్టిన నాలుగో తెలుగు సినిమాగా నిలిచింది. 

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన మల్టీస్టారర్ ‘ఎఫ్3’ కూడా మంచి వసూళ్లను రాబట్టింది. మే 27న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 134 కోట్లు సాధించింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ మూవీ ఫన్ రైడ్ తో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఐదో స్థానం దక్కించుకుంది. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు చిత్రాల లిస్టు లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘కార్తీకేయ 2’ కూడా చేరింది. సౌత్ తో పాటు నార్త్ లోనూ మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఆగస్టు 13న విడుదై మొదటి రోజునుంచే మంచి టాక్ తో దూసుకుపోతోంది. 15 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.120 కోట్లు వసూల్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎక్కువ  కలెక్షన్లు సాధించిన ఆరో చిత్రంగా ‘కార్తీకేయ 2’ నిలిచింది. 
 

‘గాడ్ ఫాదర్’తో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ములేపింది. రూ.109  కోట్లు వసూల్ చేసి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల జాబితాలోకి చేరింది. రెస్పాన్స్ లోనూ ఫర్వాలేదనిపించింది.

ఈ ఏడాది సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రాల్లో బ్యూటీఫుల్ లవ్ స్టోరీ ‘సీతారామం’ Sita Ramam ఒకటి. కేవలం రూ.30 కోట్లతో నిర్మించిన మూవీ రూ.105 కోట్లు వసూల్ చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేసింది. రికవరీలో సెన్సేషన్ క్రియేట్ చేసి అత్యధిక వసూల్ చేసిన చిత్రంగా నిలిచింది. దుల్కర్ సల్మాన్, మ్రుణాల్ ఠాకూర్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

click me!