తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

రంభ ముందు డాన్సర్‌గా పరిచయమై.. ఇప్పుడు పాన్‌ ఇండియా బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా?

Aithagoni Raju | Published : Mar 10, 2025 5:11 PM

Rambha-Sai Pallavi: హీరోయిన్‌ రంభ అంటే ఒకప్పుడు డాన్స్ సెన్సేషన్‌, గ్లామర్‌ సెన్సేషన్‌. అలాంటి రంభ ముందు ఓ అమ్మాయి డాన్సర్‌గా మెరిసింది. కానీ ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా హీరోయిన్‌గా బాక్సాఫీసుని షేక్‌ చేస్తుంది.   

15
రంభ ముందు డాన్సర్‌గా పరిచయమై.. ఇప్పుడు పాన్‌ ఇండియా బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా?
rambha

Rambha: సినిమా పరిశ్రమలో ఎవరి లైఫ్‌ ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో, ఏ రేంజ్‌కి వెళ్తారో ఊహించడం కష్టమే. ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయిన వాళ్లు ఎంతో మంది. గొప్ప స్థాయిలో ఉంటారని భావించిన వాళ్లు ఫేడౌట్‌ అయ్యే ఛాన్స్ ఉంది.

ఎంతో స్ట్రగుల్‌ పడి, ఇక సర్వైవ్‌ అవ్వడం కష్టమే అని భావించిన వాళ్లు ఊహించని విధంగా గొప్ప స్థాయిలో ఉంటారు. అలానే ఒకప్పటి సెన్సేషనల్ హీరోయిన్‌ రంభ ముందు డాన్సర్‌గా పరిచయం అయిన ఒక అమ్మాయి ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌గా ఎదగడమే కాదు, ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేస్తుంది. మరి ఆమె ఎవరో చూద్దాం. 
 

25
sai pallavi

ఒకప్పుడు డాన్సర్‌గా రాణించి ఇప్పుడు హీరోయిన్‌గా ఆకట్టుకుంటున్నది ఎవరో కాదు, లేడీ పవర్‌ స్టార్‌ సాయిపల్లవి. ఆమె `ఢీ` షో ద్వారా తన డాన్స్ టాలెంట్‌ని నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఈటీవీలో వచ్చిన షోలో ఆమె కంటెస్టెంట్ గా పాల్గొంది. 15ఏళ్ల క్రితమే ఆమె డాన్సర్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.

read  more: ప్రభాస్‌, ప్రశాంత్‌ వర్మ సినిమా టైటిల్‌ ఇదేనా? ప్రభాస్‌ని విలన్‌గా చూపించబోతున్నారా?

35
sai pallavi

ఢీ లో ఆమె బెస్ట్ డాన్సర్‌గా నిలిచింది. చాలా మంది హీరోయిన్ల ముందు ఆమె డాన్స్ పర్‌ఫెర్మెన్స్ చేసి అందరి చేత వాహ్‌ అనిపించింది. సమంత ముందు కూడా ఆమె డాన్స్ చేయడం విశేషం. 

అలాగే అప్పట్లో హీరోయిన్లలో డాన్స్ సెన్సేషన్‌గా ఉన్న రంభ ముందు సాయిపల్లవి డాన్స్ చేసింది. ఇదే షోలో మరో హీరోయిన్‌ సంగీత కూడా పాల్గొన్నారు. వీరిద్దరు జడ్జ్‌ లుగా ఉన్న ఈ షోలో సాయిపల్లవి `దైలామో` అనే పాటకి డాన్స్ చేసింది. 

45
rambha

అప్పుడు సాయిపల్లవి డాన్స్ చూసి మెచ్చుకున్నారు రంభ. ఐశ్వర్యరాయ్‌ లాంటి అందం, మాధూరీ దీక్షిత్‌ వంటీ గ్రేస్‌, సరోజ్‌ ఖాన్‌ లాంటి డాన్స్ టాలెంట్‌ ఉన్న అమ్మాయిగా ఆ షోని హోస్ట్ చేస్తున్న ఉదయభాను, అలాగే రంభ, సంగీత కూడా చెప్పారు. ఆమెని అభినందించారు. 

కట్‌ చేస్తే 15ఏళ్లలో సాయి పల్లవి చాలా ఎదిగింది. చాలా సాధించింది. మలయాళ చిత్రం `ప్రేమమ్‌`తో హీరోయిన్ గా పరిచయమై ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలతో రాణిస్తుంది.

55

ఇటీవల `అమరన్‌`తో ఇండియా వైడ్‌గా ప్రశంసలందుకుంది. `తండేల్‌`తోనూ సక్సెస్‌ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `రామాయణ` వంటి పౌరాణిక చిత్రంలో సీతగా నటిస్తుంది.

ఈ మూవీ పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతుంది. దీనికిగానూ సాయిపల్లవి ఒక్కో మూవీకి 15కోట్లు పారితోషికంగా తీసుకుంటుందని తెలుస్తుంది. ఇలా అత్యధిక పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగింది సాయిపల్లవి. 

read  more: రాజశేఖర్‌ రిజెక్ట్ చేసిన సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన చిరంజీవి, ఆ మూవీ ఏంటో తెలుసా? రెండు సార్లు సేమ్‌

also read: రామ్‌ చరణ్‌ చేత గిన్నెలు తోమిపిచ్చిన సుకుమార్‌.. విషయం తెలియడంతో చిరంజీవి రియాక్షన్‌ ఏంటో తెలుసా?
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!
Recommended Photos