Samantha: సమంత, సిద్ధార్ధ్ విడిపోకముందు.. ఆ సినిమా అంత వివాదం సృష్టించిందా ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 22, 2022, 06:30 PM IST

నాగ చైతన్యతో వివాహ బంధం నుంచి విడిపోయిన తర్వాత సమంత ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం సమంత పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. యశోద , శాకుంతలం ఇలా క్రేజీ చిత్రాలతో ఈ ఏడాది సమంత ప్రేక్షకులని పలకరించబోతోంది.

PREV
16
Samantha: సమంత, సిద్ధార్ధ్ విడిపోకముందు.. ఆ సినిమా అంత వివాదం సృష్టించిందా ?

నాగ చైతన్యతో వివాహ బంధం నుంచి విడిపోయిన తర్వాత సమంత ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం సమంత పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. యశోద , శాకుంతలం ఇలా క్రేజీ చిత్రాలతో ఈ ఏడాది సమంత ప్రేక్షకులని పలకరించబోతోంది. ఇక హీరో సిద్ధార్థ్ ఆరంభంలో క్రేజీ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఆ తర్వాత సిద్దార్థ్ కెరీర్ పూర్తి డల్ గా మారిపోయింది. 

26

నాగ చైతన్యతో ప్రేమలో పడక ముందు సమంత.. సిద్దార్థ్ మధ్య ఘాటుగా ఎఫైర్ సాగింది. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకుని విడిపోయారు. సమంత, సిద్దార్థ్ కలసి 2013లో జబర్డస్త్ అనే చిత్రంలో నటించారు. నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఏ చిత్రం విడుదలయ్యాక సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. 

36

రన్ వీర్ సింగ్, అనుష్క శర్మ జంటగా నటించిన బ్యాండ్ బాజా భారత్ అనే చిత్రాన్ని కాపీ చేసారు అంటూ ఆరోపణలు వినిపించాయి. దీనిపై యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ కోర్టుకి కూడా వెళ్ళింది. అప్పట్లో సిద్ధార్థ్, సమంత ప్రేమ వ్యవహారం గురించి మీడియాలో వార్తలు వస్తుండడంతో ఈ జోడికి మంచి క్రేజ్ ఉండేది. 

46

వీరి క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని తమిళ దర్శకుడు లింగుస్వామి ప్రయత్నించారు. తమిళంలో జబర్దస్త్ చిత్రాన్ని డబ్ చేసి రిలీజ్ చేయనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఈ మేరకు డబ్బింగ్ హక్కులు సొంతం చేసుకున్నారు. కానీ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అడ్డుకట్ట వేసింది. జబర్దస్త్ చిత్రంలోని చాలా సన్నివేశాలు బ్యాండ్ బాజా భారత్ ని పోలి ఉండడంతో కోర్టు స్టే విధించింది. 

56

జబర్దస్త్ చిత్రాన్ని డబ్ చేయకూడదని, డివిడి, టీవీలలో ప్రసారం చేయకూడదు అని కోర్టు స్టే ఇచ్చింది. దీనితో లింగుస్వామికి ఎదురుదెబ్బ తప్పలేదు. ఇక యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఆలస్యం చేయకుండా బ్యాండ్ బాజా భారత్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేశారు. ఇందులో నాని, వాణికపూర్ జంటగా నటించారు. 

66

కానీ రిజల్ట్ నిరాశపరిచింది. సమంత, సిద్దార్థ్ నటించిన జబర్దస్త్.. వాణి కపూర్, నాని నటించిన ఆహా కళ్యాణం రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. ఈ చిత్రం తర్వాత కొంత కాలానికి సమంత, సిద్ధార్థ్ విడిపోయారు. ఓ నటితో ఎఫైర్ పెట్టుకున్నాడనే కారణంతో సిద్ధార్థ్ నుంచి సమంత విడిపోయినట్లు ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా సమంత, నాగ చైతన్య విడిపోయాక సిద్దార్థ్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. మోసం చేసేవారు ఎప్పుడూ బాగుపడలేదు అంటూ పరోక్షంగా సిద్దార్థ్ ట్వీట్ చేశాడు. 

click me!

Recommended Stories