వైష్ణవ్తేజ్తో కలిసి కృతి శెట్టి నటించిన `ఉప్పెన` చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడికి అనేక ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాని హీరోగా రూపొందే `శ్యామ్ సింగరాయ్`లో నటిస్తుంది. దీంతోపాటు సుధీర్బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రంలో చేస్తుంది.
undefined
అలాగే అక్కినేని అఖిల్తోనూ ఓ సినిమా చేయబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం కృతితో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అంతేకాదు పలు పెద్ద సినిమాలు కూడా ఈ అమ్మడిని వెతుక్కుంటూ వస్తున్నాయని, దర్శక, నిర్మాతలు కృతి డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారని వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
undefined
ఇదిలా ఉంటే తాజాగా మంగళవారం కృతి శెట్టి మీడియాతో ముచ్చటించింది. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. మెగాస్టార్ చిరంజీవి `ఉప్పెన` ప్రీ రిలీజ్లో తనని కాబోయే స్టార్ అని ప్రశంసించడం తనకు దక్కిన బెస్ట్ కాంప్లిమెంట్ అని పేర్కొంది.
undefined
అదే సమయంలో రామ్చరణ్ అంటే బాగా ఇష్టమట. `రంగస్థలం` సినిమా చూశాక ఆయనంటే ఇష్టం పెరిగిందని చెప్పింది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ హీరోలు, దర్శకుల గురించి తెలుసుకుంటున్నట్టు చెప్పింది.
undefined
తాను డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యిందట. మోడల్గా చేస్తున్న సమయంలో ఈ ఆఫర్ వచ్చిందని, సినిమాకి ఒప్పకున్నాక తనకు భయం స్టార్ట్ అయ్యిందని చెప్పింది. నిజానికి నాలాగే వైష్ణవ్ తేజ్ కి కూడా సినిమా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఆ విషయం ఈ మధ్యనే ప్రమోషన్స్ లో తనకు తెలిసిందని, తను బ్రిలియంట్ యాక్టర్ అని చెప్పింది. పాత్ర కోసం కష్టపడి తెలుగు నేర్చుకున్నా అని చెప్పింది.
undefined
తన ఒరిజినల్ క్యారెక్టర్కి, `ఉప్పెన`లోని బేబమ్మ పాత్రకి పూర్తి భిన్నమని, బేబమ్మ చాలా హైపర్ యాక్టివ్ అని, ఆ పాత్రలో ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా టైమ్ పట్టిందని, మొదట షూటింగ్ చాలా భయటపడ్డానని దర్శకుడు, నటుడు విజయ్ సేతుపతి బాగా సపోర్ట్ చేశారని చెప్పారు. ఆయన కొన్ని టిప్స్ కూడా ఇచ్చారట.
undefined
తాను నటించిన ఒక ఎమోషనల్ సీన్ చూసి సెట్ లో ఒక వ్యక్తి ఏడ్చాడు. అది చూసి నటిగా నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. షూటింగ్ టైం లో అదే నాకు బెస్ట్ మూమెంట్ అని చెప్పింది. సుకుమార్ గారు చాలా సపోర్ట్ చేశారని చెప్పింది.
undefined