Naga Panchami today Episode:పంచమి కోసం తపిస్తున్న మోక్ష, కుళ్లిపోయిన నంభూద్రి శవం, పగతో రగిలిపోతున్న కరాళి..!

Published : Jan 27, 2024, 03:10 PM IST

వైదేహి  మాత్రం.. అసలు పంచమికి ఈ ఇంటి కోడలికి ఉండే అర్హత లేదని.. కేవలం నీ ప్రాణాలు కాపాడగలదని మాత్రమే ఈ ఇంటికి కోడలిగా ఉండేందుకు అంగీకరించాను అని అంటుంది.

PREV
15
Naga Panchami today Episode:పంచమి కోసం తపిస్తున్న మోక్ష, కుళ్లిపోయిన నంభూద్రి శవం, పగతో రగిలిపోతున్న కరాళి..!
Naga panchami

Naga Panchami today Episode: మోక్ష ఇంట్లో మేఘన పూజ చేస్తుంది. ఆమె అలా పూజ చేయడం చూసి ఇంట్లో వారందరూ సంతోషిస్తారు. ఆమె తీసుకువచ్చి అందరికీ హారతి ఇస్తుంది. అందరూ తీసుకుంటారు. అక్క వాళ్లకు కూడా ఇస్తాను అని మేఘన అంటే.. ఇంట్లో వాళ్లందరూ కలిసి.. జ్వాల, చిత్రలపై సెటైర్లు వేస్తారు. వాళ్లకు తిండి ఉంటే చాలని, పూజలు అవసరం లేదు అని అంటారు ఆ మాటలు విని హర్ట్ అయిన జ్వాల, చిత్రలు..  ఇంట్లో వాళ్లపై తిరిగి సెటైర్లు వేస్తారు.

25
Naga panchami

అయితే.. వాళ్లను ఆపమని.. వైదేహి మోక్షను పిలుస్తుంది. మోక్ష రాగానే.. నీకు పునర్జన్మ ఈ మేఘన రూపంలో దక్కిందని.. దేవుడికి నమస్కరించి హరతి తీసుకోమని చెబుతారు. కానీ.. మోక్ష తీసుకోడు. వైదేహి ఎన్నిసార్లు చెప్పినా హారతి తీసుకోకపోగా.. తనకు అసలు ఈ ప్రాణమే వద్దు అంటాడు. కావాలంటే ప్రాణం తీసుకోమని చెబుతాడు. నిజానికి తాను ఈ రోజు బతకలేదని.. చాలా రోజులుగా తాను బతికి ఉన్నానంటే దానికి పంచమినే కారణం అని అంటాడు. అయితే.. వైదేహి  మాత్రం.. అసలు పంచమికి ఈ ఇంటి కోడలికి ఉండే అర్హత లేదని.. కేవలం నీ ప్రాణాలు కాపాడగలదని మాత్రమే ఈ ఇంటికి కోడలిగా ఉండేందుకు అంగీకరించాను అని అంటుంది.

35
Naga panchami

మోక్ష మాత్రం.. తాను పంచమి లేకుండా బతకలేనని.. మీరు ఇఛ్చిన జన్మ ఎప్పుడో పోయిందని.. తాను మిగిలింది కేవలం పంచమి పోసిన ప్రాణంతోనే అని అంటాడు.  ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంట్లో వాళ్లు కూడా అసహనంతో వెళ్లిపోతారు. అయితే.. మేఘన మాత్రం.. మోక్ష ప్రాణం పోయినా.. పంచమిని దూరం చేయలేమేమో అని అనుకుంటుంది.

శబరి కూడా.. మోక్ష, పంచమి విషయంలో తాము తప్పు చేస్తున్నామా అని ఫీలౌతుంది నిజంగా పంచమి అమాయకురాలు అయితే.. ఆ దేవుడు తనకు అన్యాయం జరగకుండా చూసుకోవాలి అని అనుకుంటుంది, 

45
Naga panchami

ఇక.. మేఘన తన అన్నయ్య ఆత్మను రప్పిస్తుంది. నంభూద్రి ఆత్మలా వచ్చి ఏమైంది కరాళి అని అడుగుతాడు. తాను నాగమణి సాధించలేకపోయాను అని జరిగిన విషయం చెబుతుంది. నిన్ను నేను కాపాడుకోలేకపోయాను అని బాధపడుతుంది. మోక్షను బలి ఇస్తే తప్ప.. నాకు మహాకాళీ శక్తులు ఇవ్వను అంటోందని  కూడా చెబుతుంది. అయితే... మహాకాళీ కూడా నిన్ను మోసం చేస్తుందేమో జాగ్రత్త గా ఉండు అని నంభూద్రి చెబుతాడు. ఇక.. తన శరీరం మొత్తం కుళ్లిపోయిందని.. ఏం చేసినా తనను బతికించలేవు అని చెబుతాడు. మోక్షను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండమని చెబుతుంది. కానీ.. మేఘన తనకు సంసార జీవితం మీద ఆశలేదని.. ఏ నాటికి అయినా.. మహా మాంత్రికురాలిని కావాలని అనుకుంటుంది. ఇక.. నంభూద్రి మాయం అయిపోతాడు.

55
Naga panchami

ఇక..నాగచంద్రకాంత మొక్కను తన రూపంలో తీసుకువచ్చింది కరాళి అనే అనుమానం పంచమికి కలిగిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకోవడానికే కరాళి స్థావరానికి పంచమి, ఫణీంద్ర వస్తారు. వారికి కరాళి నే మేఘన అనే విషయం తెలిస్తే.. కథ మళ్లీ ఆసక్తిగా మారే అవకాశం ఉంది. మరి.. ఆ విషయం వారు ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి.

click me!

Recommended Stories