రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గత వారం విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 500 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో కంటెంట్ పై విమర్శలు వస్తున్నప్పటికీ ఆడియన్స్ మాత్రం థియేటర్స్ కి ఎగబడుతూనే ఉన్నారు.