వారసుడు(Varasudu) సంక్రాంతి బరిలో దించాలనే తన పంతం దిల్ రాజు నెగ్గించుకున్నారు. అదే సమయంలో దిల్ రాజు మైత్రీ మూవీ మేకర్స్ పై కత్తి కట్టాడు అనేది ప్రధాన ఆరోపణ. మైత్రీ స్వయంగా నిర్మించి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల కలెక్షన్స్ దెబ్బతీసేందుకు ఆయన స్కెచ్ వేసిపెట్టాడట. మైత్రీ తమ సినిమాలు దిల్ రాజు చేతిలో పెట్టకుండా స్వయంగా విడుదల చేసుకోవడమే దీనికి కారణమట . వారసుడు మూవీ కోసం పెద్ద ఎత్తున థియేటర్స్ లాక్ చేసి ఉంచిన దిల్ రాజు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు థియేటర్స్ పూర్తి స్థాయిలో లభించకుండా చేసే ప్రణాళికలు రచించారట.