తుఫానుకు ముందు నిశ్శబ్దం... ఉల్లి పొర లాంటి దుస్తుల్లో అందాలన్నీ చూపిస్తూ సమంత సంచలనం!

First Published Sep 9, 2021, 1:01 PM IST

ఇటీవలే గోవా ట్రిప్ ముగించుకొని వచ్చింది టాలీవుడ్ క్వీన్ సమంత. ఫ్యాషన్ డిజైనర్, డైట్ ఎక్స్పర్ట్ అయిన శిల్పా రెడ్డి సమంతకు బెస్ట్ ఫ్రెండ్ కాగా, ఆమె కుటుంబంతో కలిసి గోవా టూర్ కి వెళ్లారు. 
 


సమంత తన గోవా వెకేషన్ కి సంబంధించిన పిక్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకున్నారు. సైక్లింగ్ చేస్తూ కనిపించిన సమంత, సముద్రంలో బోటింగ్ వంటి సాహసాలు కూడా చేశారు. 

వెకేషన్ నుండి హైదరాబాద్ వచ్చిన వెంటనే ప్రొఫెషన్ లో బిజీ అయ్యారు. పలు బ్రాండ్స్ కి ప్రచారం కల్పిస్తూ ఫోటో షూట్స్ లో పాల్గొంటున్నారు ఆమె. తాజాగా ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా ఫ్యాషన్ బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఫోటో షూట్ చేశారు. 


ఉల్లిపొరల్లాంటి ట్రెండీ డిజైనర్ వేర్ లో సమంత లుక్ సూపర్ స్టైలిష్ గా ఉంది. ఈ జీరో సైజు బేబీ ఒంటిపై అందమైన డ్రెస్ మరింత అందం సంతరించుకుంది. 

సమంత క్రేజ్ పీక్స్, ఆమెకు వివాహం జరిగినా, పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతున్నా యూత్ లో ఫాలోయింగ్ తగ్గలేదు. అందుకే ఇప్పటికీ భారీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటూ తానేమిటో నిరూపిస్తున్నారు. 


టాలీవుడ్ లో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన హీరోయిన్ గా పలు జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉన్నారు. 


సమంత ఒప్పుకోవాలి గాని సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు డబ్బులు, కథలతో సిద్ధంగా ఉన్నారు.అయితే సమంత మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. 

మరోవైపు సమంత వ్యక్తిగత జీవితంపై అనేక పుకార్లు చుట్టుముట్టాయి. భర్త చైతూతో ఆమెకు విబేధాలు తలెత్తాయని, విడివిడిగా ఉంటున్న ఈ జంట విడాకులు తీసుకొనే ఆలోచనలు ఉన్నట్లు, సదరు కథనాల సారాంశం. 


ఈ పుకార్లపై సమంత మాత్రం నోరు విప్పడం లేదు. తుఫానుకు ముందు ప్రశాంతతలా, సమంత ఏదో ఒకరోజు బాంబ్ పిలుస్తారేమో అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. 

మీడియా కథనాలు పట్టించుకోకుండా, వృత్తిలో బిజీ అవుతున్నారు. సినిమాలకు విరామం ప్రకటించినా, ఫోటో షూట్స్ తో రెచ్చిపోతున్నారు. సమంత హాట్ హాట్ క్రేజీ ఫోజులు వైరల్ గా మారాయి.

click me!